Ec strict on chandrababu and modi complains parties

EC strict on Chandrababu and Modi complains parties, assembly elections 2014, andhra elections 2014, telengana elections 2014, Lok Sabha elections 2014, General Elections 2014, elections 2014, andhra pradesh assembly elections 2014, andhra elections 2014 survey, andhra pradesh elections 2014 survey, ap assembly elections 2014

EC strict on Chandrababu and Modi complains parties

చంద్రబాబు, మోదీల మీద ఇసి కఠినత్వం

Posted: 05/01/2014 10:18 AM IST
Ec strict on chandrababu and modi complains parties

ఈసారి సార్వత్రిక ఎన్నికలు అన్ని పార్టీలకూ అత్యంత ప్రతిష్టాత్మకం అవటమే కాకుండా దేశ విదేశాలలో కూడా దేశ రాజకీయాల ముఖచిత్రాన్నే మార్చివేస్తున్న ఈ ఎన్నికల మీద ఉత్కంఠ ఏర్పడింది.  ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల కమిషన్ కూడా ఎటువంటి ఆరోపణలకూ తావీయ గూడదన్న విధంగా అత్యంత నియమ నిష్టలతో, కఠినంగా వ్యవహరించటానికి పూనుకున్నట్లుగా కనిపిస్తోంది.  కాకపోతే అధికార పార్టీ మీద కాకుండా ఆ కఠినత్వం ప్రతిపక్షాల మీదకు మళ్ళినట్లుగా విమర్శలు వస్తున్నాయి.

భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, తాను ఇంత వరకు ఏ కేసులోనూ ఇరుక్కోలేదని, కనీసం స్కూటర్ రాంగ్ రూట్ లో నడిపిన కేసు కూడా తన మీద నమోదవలేదని, అయితే ఎన్నికల కమిషన్ మాత్రం ఏప్రిల్ 30 న తను కమలం చూపించినందుకు కేసు పెట్టిందని, తాను చూపించిందేమీ కత్తికాని, తుపాకి కాని కాదని కేవలం తామరపువ్వని అన్నారాయన.  కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నిస్పృహలో ఉందో దీన్నిబట్టి అర్థమౌతోందని కూడా మోదీ విమర్శించారు.

చంద్రబాబు నాయుడు వోటేసి వచ్చిన తర్వాత పోలింగ్ బూత్ కి వంద మీటర్ల దూరంలో ఉన్నప్పుడు తాను భారతీయ జనతా పార్టీకి వోటు వేసానని చెప్పిన మాటలు మీడియాలో రాగా స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి భన్వర్ లాల్ చంద్రబాబు వేసిన వోటుని అనర్హత వోటుగా పరిగణిస్తామని అన్నారు.  దీని మీద తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చెయ్యటం జరిగింది.  భన్వర్ లాల్ తన పరిధిలో లేని విషయాల మీద మాట్లాడుతున్నారని తెదేపా అభియోగం.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles