బుధవారం తిరుపతిలో జరిగిన ఎన్డియే విజయ శంఖారావం సభలో మాట్లాడిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగూ సీమాంధ్రలో గల్లంతైంది కాబట్టి కాంగ్రెస్ హఠావో అనే పిలుపు ఇక నిరర్ధకమని చెప్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ హఠావో సీమాంధ్ర బచావో అనే కొత్త పిలుపునిచ్చారు.
తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ మీద ఇంతవరకు ఎవరూ సాహసించని రీతిలో ఎదురుదాడికి దిగిన పవన్ కళ్యాణ్ తాను పార్టీ పెట్టి 50 రోజులే అయినా సీమాంధ్రులను మళ్ళీ మళ్లీ అవమానపరుస్తున్న కెసిఆర్ మీద తాను ధ్వజమెత్తినప్పుడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఎందుకు మాట్లాడటం లేదని సూటైన ప్రశ్నను సంధించారు పవన్ కళ్యాణ్. సీమాంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడలేని జగన్ సీమాంధ్రకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదన్నారాయన.
ఈ సందర్భంగా కెసిఆర్ నాలుకంతా విషమేమనని అన్నారు పవన్ కళ్యాణ్. అందరినీ తిట్టే కెసిఆర్ కాబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా తిట్టటం సహించలేకపోయానని, విషానికి విషమే విరుగుడు కాబట్టి కెసిఆర్ విషయంలో తాను కూడా అదే పద్ధతిలో మాట్లాడానని, మోదీకి కెసిఆర్ క్షమాపణ చెప్పినట్లయితే అప్పుడు ఏం చెయ్యాలన్నది ఆలోచిస్తానని అన్నారాయన. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ కలిస్తే 1, 1, 1 కలిసి 3 కాదని 111 అని మోదీ అన్న మాటలను విమర్శించిన కెసిఆర్ ని పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు.
కాంగ్రెస్, వైయస్ఆర్ కాంగ్రెస్ లు రెండూ దోచుకోవటంలో ఒకరికొకరు తీసిపోరని, వైకాపా కి వోటేస్తే కాంగ్రెస్ కి వోటేసినట్లేనని, అఖండ ఆంధ్రప్రదేశ్ నే దోచుకున్నవారికికి తెలంగాణా లేని భూభాగాన్ని దోచుకోవటమో పెద్ద కష్టమైన పని కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
తెలంగాణాలో జరగాల్సింది పునర్నిర్మాణమైతే ఆంధ్రప్రదేశ్ లో అసలేమీ లేదు కనుక మంచి ప్రభుత్వం వచ్చినట్లయితేనే నిర్మాణం సాధ్యమని పవన్ కళ్యాణ్ అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more