తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆదివారం భారతీయ జనతాపార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు.
ఈ మధ్యకాలంలో తెలుగు సినిమారంగం నుంచి వరుసగా సినీ హీరోలు నరేంద్ర మోదీని కలిసివచ్చారు. ఆయనను కలిసినవారంతా ఒకే మాట చెప్తున్నారు మోదీయే ప్రధానమంత్రి పదవికి అర్హులని, దేశాన్ని అభివృద్ధి చేసే శక్తి ఆయనకే ఉందని. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఒకడుగు ముందుకేసి జనసేన పార్టీ పెట్టటం, బాహాటంగా భాజపాకి తెదేపాలకు మద్దతు తెలపటమే కాకుండా, వారికి ప్రత్యర్థి పార్టీయైన కాంగ్రెస్ ని తరిమికొట్టాలనే పిలుపునివ్వటం కూడా జరిగింది.
ఈ రోజు రజనీకాంత్ కూడా మోదీని కలవనున్నారు. దీనితో ఆయన రాజకీయ వైఖరి ఎలా ఉండబోతున్నదానిమీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజకీయాలకు ఇంతకాలం దూరంగా ఉంటూ, ప్రతిసారీ ఎన్నికల ముందూ తాను ఏ పార్టీకీ మద్దతునివ్వబోవటం లేదన్న ప్రకటన చేసే రజనీకాంత్, ఈ సారి 2014 ఎన్నికల ముందుగా, దేశమంతటా రాజకీయాలు రసవత్తరంగా మారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియకుండా రాజకీయ రంగమంతా ఉత్కంఠ భరితంగా మారిన వేళ, ప్రత్యేకంగా భారతీయ జనాతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీతో భేటీ అవటం ఆసక్తికరంగా తయారైంది.
ఆయనే గనక భాజపాకి మద్దతు ప్రకటిస్తే తమిళనాడులో భాజపా జెండా పాతటం ఖాయం. లోగడ ఒకే ఒక్కసారి రజనీకాంత్ 1996 లో తమిళ మానిల కాంగ్రెస్ పార్టీ నాయకుడు మూపనూర్ కి సానుకూల ధోరణి చూపించారు కానీ అప్పుడు కూడా మద్దతును ప్రకటించలేదు.
ఆదివారం నాడు తమిళనాడు పర్యటనలో ఉన్న నరేంద్ర మోదీ బహిరంగ సభకు హాజరవటానికి ముందుగా చెన్నైలోని రజనీ కాంత్ నివాసంలో సాయంత్రం 5.00 గంటల ప్రాంతంలో ఆయనతో సమావేశమౌతారు. రోజురోజుకీ మార్పులు సంతరించుకుంటున్న దేశ రాజకీయాలలో రజనీకాంత్ మోదీల భేటీ వలన ఏమైనా మార్పులు చోటుచేసుకుంటాయా అన్నది వేచి చూడవలసివుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more