ప్రస్తుతం పార్టీల వ్యూహాల విషయంలో చర్చలోకి వెళ్ళే ముందు కొన్ని పర్యాయపదాలను మనం సరిగ్గా అర్థం చేసుకున్నామో లేదో సరిచూసుకుందాం!
రాజకీయం అంటే ఏమిటి?
రాజ్యం అన్యాక్రాంతం కాకుండా ఉండటం కోసం ఆచరించే పనులు, చేసే యోజనలు, పన్నే వ్యూహాలు, చేసే యుద్ధాలు ఇవన్నీ పూర్వకాలంలో రాజకీయం అనిపించుకునేవి. అంటే, రాజ్యాన్ని కైవసం చేసుకోవటానికి చేసే ఎత్తుగడలు, దక్కిన తర్వాత ఆ రాజ్యాన్ని కాపాడుకోవటానికి చేసి పన్నాగాలు రాజకీయాలు. అదే పదాన్ని ఈ కాలంలో కూడా, ప్రజాస్వామ్యం సాగుతున్న తరుణంలో కూడా వాడుతున్నాం- దాని అర్థం పూర్తిగా తెలియకుండానే!
రాష్ట్రం, లేక దేశంలో పాలన పరాయి హస్తాలలోకి పోవటమనేది జరగదు. ఎందుకంటే పోటీ చేసేవాళ్ళంతా మన దేశస్తులే కనుక. సిద్ధాంతపరంగా తన పార్టీ కానీ తనకున్న శక్తియుక్తులు కానీ ప్రజలకు ఎక్కువ మేలు చేస్తాయనుకున్నప్పుడు కూడా ఆ రకంగా ప్రజాసేవ చెయ్యటానికీ అధికారాన్ని చేజిక్కించుకోవటానికి ఎత్తుకు పై ఎత్తులు వెయ్యవలసిందే. అంటే, ప్రజాసేవ చెయ్యటానికైనా కూడా పార్టీ పరంగా అధికారం చేజిక్కించుకోవటం అవసరమే. వాటినే ఈ కాలంలో రాజకీయం అని వ్యవహరిస్తున్నాం. అందుకోసం ప్రతి రాజకీయ పార్టీకీ ఒక వ్యూహం ఉంటుంది, తమకు ప్రతిపక్షమైన పార్టీని చిత్తు చెయ్యటానికి వాళ్ళ వ్యూహాలకు ప్రతివ్యూహాలు పన్నటం కూడా ఉంటుంది.
ప్రజాస్వామ్యం నిజంగా ఉందా కేవలం పేరుకేనా?
అసలు ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ఎవరో ఒకరు బలవంతుడైనవాడు ప్రభువుగా, తనంతట తానే ఏలికగా ప్రకటించుకోవటమనే విధానం కాకుండా, ప్రజలంతా కలిసి తమకి ఇష్టమైన, తమకి వాళ్ళ నాయకత్వం మీద, వాళ్ళ నిజాయితీ మీద నమ్మకమున్న నాయకుడిని ఎన్నుకుని, వాళ్ళకి పరిపాలనా బాధ్యతలను అప్పగించటం ద్వారా ప్రభుత్వం నడిచేట్టుగా చెయ్యటమే ప్రజాస్వామ్యం. పాలనను నడపాల్సింది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాని తన బుద్ధిబలంతో కానీ భుజబలంతో కానీ అయ్యే ప్రభువు కాదు.
అలాంటి ప్రజాస్వామ్యం నిజంగా మన దేశంలో ఉందా, లేకపోతే నామమాత్రంగా చెప్పుకోవటం వరకేనా, అంటే కొన్ని విషయాలలో కొన్ని పార్టీల పద్ధతులు ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్నాయి, కొన్నిటిలో లేవు. దీన్ని కేవలం ఒక అభిప్రాయంలా కాకుండా సవివరంగా పరిశీలిద్దాం!
తెలుగు దేశం పార్టీ అధినాయకత్వం తను గతంలో చేసిన కొన్ని తప్పులు తెలుసుకున్నానని, సమాజంలో అందరినీ కలుపుకుపోవాలని, వెనకబడిన జాతులను, కులాలను ఉద్ధరించాలని, అందుకోసం ఆ కులాల వారికి అధికారం కట్టబెట్టాలని చెప్తోంది! అందుకే తెలంగాణా ప్రాంతంలో బిసిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పటం జరిగింది, బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడిని పార్టీలోకి తీసుకుని పార్టీ టికెట్ ఇవ్వటమూ జరిగింది. అలాగే సీమాంధ్రలో కూడా పార్టీకి అండదండలుగా ఉండి వెన్నుకాచే తన సొంత కులంతోపాటు ఇతర కులాలవారికి కూడా అవకాశం ఇవ్వటం జరిగింది.
ఇది నిజమైన ప్రజాస్వామ్య విధానమని అనిపిస్తోంది కదూ! నిజంగా ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకూ సమానమైన అవకాశం ఇవ్వటమన్నది జరిగి, వారందరి సమిష్టి కృషితో ప్రభుత్వం నడిస్తే అంతకంటే ఆదర్శప్రాయమైన సమాజం ఎక్కడ చూస్తాం?
ఈ వ్యాసం కొనసాగింపులో, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ సూత్రాన్ని ఎంతవరకు పాటించారన్నది విశ్లేషించి చూద్దాం! అపర చాణక్యుడని పేరు గాంచిన చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రతిభను ఎలా ఉపయోగించుకున్నారో పరిశీలిద్దాం!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more