తెలంగాణా రాష్ట్ర సమితి వచ్చిందంటే మళ్ళీ దొరల రాజ్యం వస్తుందని, తెలుగు దేశం పార్టీ వస్తేనే గరీబుల రాజ్యం అవుతుందని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం వరంగల్ లో జరిగిన ప్రజాగర్జనలో అన్నారు.
తెదేపా ఉండదని ఆశపడ్డారు కొందరు నేతలు, కానీ ఓరుగల్లు మళ్ళీ తెదేపాకి బ్రహ్మరథం పడుతోంది అన్న చంద్రబాబు కాకతీయుల చరిత్ర ఈ నాటిది కాదు 860 సంవత్సరాల క్రితందని, ఒక్కో మహిళ రుద్రమ దేవిగా ఒక్కో తమ్ముడు ప్రతాపరుద్రుడిగా తయారవ్వాలని పిలుపునిచ్చారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం తెలుగు దేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ అధికారాన్ని పదవులను ఆశించి రాలేదని, భూస్వాములకు, పెత్తందార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసారని అన్నారు చంద్రబాబు. ఆనాడే తెలంగాణాకి నిజమైన స్వాతంత్రం వచ్చిందని ఆయన తెలియజేసారు. పటేల్ పట్వారీ వ్యవస్థలను అంతమొందించింది ఎన్టీఆరే అని గుర్తు చేసారాయన.
తెలంగాణా తెచ్చుకున్న ఘనత కేవలం ప్రాణాలు ధారపోసిన అమరులదని, బలిదానం కెసిఆర్ చెయ్లేదు, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు చెయ్యలేదు అని చంద్రబాబు గుర్తుచేసారు. అటువంటి త్యాగమూర్తుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తామని చంద్రబాబు మాటిచ్చారు.
గ్రామ గ్రామాలకు సిమెంట్ రోడ్లు, నీళ్ళు, హైస్కూళ్ళు, కాలేజ్ లు, ఉన్నత విద్యలో మెడికల్ కాలేజ్ లు ఉన్నాయంటే అది కేవలం తెదేపా వలనే వచ్చాయని, సింగపూర్ అభివృద్ధి చెందటానికి 50 సంవత్సరాలు పడితే కేవలం 9 సంవత్సరాలలోనే హైద్రాబాద్ ని అభివృద్ధి చేసామని చంద్రబాబు అన్నారు. అందువలన తెలంగాణాలో వోట్లు వెయ్యమని అడిగే హక్కు కేవలం తెదేపాకే ఉందని ఆయన అన్నారు.
కెసిఆర్ మీ ఊరికేమీ చెయ్యలేదని, ఆయన చేసిందల్లా బీడీ కట్టల మీద పుర్రె బొమ్మలను వేయించి బీడీ కార్మికుల పొట్టకొట్టటమేనని చెప్పిన చంద్రబాబు, తన సొంత వూరుని విస్మరించి హైద్రాబాద్ ని అభివృద్ధి చేసానని అన్నారు. రాజ్యాధికారాన్ని బిసికి అప్పగించాలని అన్నది కూడా తెదేపాయే ఇప్పుడు దానికే కట్టుబడివున్నామని చంద్రబాబు అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more