దివంగత నేత వైయస్ఆర్ ఆత్మగా చెప్పుకునే కెవిపి దేశంలో అవినీతికోసం విదేశాలనుంచి నడిపిన అక్రమ చిట్టా అంతా షికోగా లో బయటపడింది.
ఎనిమిది సంవత్సరాల క్రితం వైయస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు, టైటానియమ్ ఉత్పత్తులకు పనికివచ్చే ఖనిజాలను ఆంధ్రప్రదేశ్ లో బయటకు తీసి వాటిని విదేశాలలో అమ్మి కోట్లు పోగుచేసుకోవటానికి కెవిపి చేసిన ప్రయత్నాలను అమెరికా ప్రభుత్వం బయటపెట్టటమే కాకుండా, మొత్తం 111 కోట్ల రూపాయలకు గాను 64 కోట్ల రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో కీలకమైన స్థానాలలో ఉన్నవారికి బట్వాడా చెయ్యటం కూడా జరిగిందని, అక్రమం జరిగింది భారత దేశానికి వ్యతిరేకంగానేనైనా, ఆ నేరంలో అమెరికా భూభాగాన్ని, అమెరికా లోని ఆర్థిక వ్యవస్థలను ఉపయోగించుకున్నందుకు గాను షికాగోలోని ఫెడరల్ కోర్టులో జూన్ 13,2013 లో అభియోగాలు మోపబడ్డాయి. ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ దాన్ని సీల్ చేసింది. వాటి వివరాలు బుధవారమే బయటకు వచ్చాయి.
ఈ కేసును అంతర్జాతీయ కుంభకోణంగా తీసుకున్న అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ ముఠాను ఉపయోగించుకుని తనకు తనవాళ్ళకి లాభం చేకూరటం కోసం ఆర్థిక నేరానికి పాల్పడ్డారన్నది కెవిపి మీద అభియోగం. ఈ క్రమంలో కెవిపి మీద ఐదు కేసులు నమోదు అయ్యాయి.
కెవిపికి ఈ అక్రమార్జనలో సహకరించినవారిమీద కూడా అభియోగాలు నమోదయ్యాయి. వారిలో హంగేరీ కి చెందిన ఆండ్రస్ నాప్ అనే వ్యాపారి, ఉక్రెయిన్ కి చెందిన సురేన్ జెవోర్గాన్, అమెరికా పౌరసత్వంగల భారతీయుడు గజేంద్ర లాల్, శ్రీలంకకు చెందన పెరియస్వామి ఉన్నారు. ఆ ఆరుగురిమీద పెట్టిన కేసులో నిందితుల ఆస్తులను జప్తు చెయ్యాలని కూడా కోరటమైంది. ఈ మొత్తం నేరంలో కీలకమైన పాత్ర పోషించిన ఉక్రెయిన్ కి చెందిన దిమిత్రీ షిర్తాష్ ను మార్చి 12 న అరెస్ట్ చేసి 1.74 కోట్ల పూచీకత్తు మీద 21 న విడుదల చేసారు. షిర్తాఫ్ వైయస్ ఆర్ ని కలిసినట్లుగా కూడా ఆ అభియోగంలో పేర్కొనబడింది.
గాలి జనార్దన రెడ్డి లా కాకుండా విదేశీ సంస్థకి ఖనిజాలను తవ్వే అనుమతులు ఇప్పించి తద్వారా కోట్లు రాబట్టటం ఉద్దేశ్యంగా, గనుల తవ్వకాలకు ప్రభుత్వ అనుమతులు అవసరం కాబట్టి ఇక్కడ అందుకోసం 110 కోట్ల రూపాయలను లంచాల రూపంలో ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. ఆ లంచాలను విదేశాలలో బ్యాంక్ ఖాతాలు తెరిచి అందులో జమ కట్టేందుకు సుందరలింగం తగు ఏర్పాట్లను చేసారు. అందులో 64 కోట్లు బదిలీ అయ్యాయి కూడా. అవన్నీ వివిధ దేశాలలో రిజిస్టరైన 159 కంపెనీల ద్వారా లావాదేవీలు జరిగినట్లుగా దర్యాప్తులో తేలింది. భారత్ లోని గనుల ద్వారా ఏటా 60 లక్షల టన్నుల టైటానియం స్పాంజ్ ని ఎగుమతి చేసేందుకు ఒప్పందాలు కుదిరాయి.
అంటే, ఆర్థిక నేరాల ద్వారా అక్రమ ఆర్జన చేసిన కేసుల్లో ఇప్పటి వరకు బయటపడిన కేసులే కాకుండా ఇంకా ఉన్నాయన్నదానికి అమెరికా ప్రభుత్వం తెరదించింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more