సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలలో నిలబడటానికి అభ్యర్థులే కరువైతే, తెలంగాణాలో సీనియర్ నాయకులంతా వారి పిల్లలను కూడా రాజకీయ రంగంలో అరంగేట్రం చేయించటానికి ఇదే అదునని భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. కొడుకులు, కూతుళ్ళు, భార్యలు, దగ్గర బంధువలకు కాంగ్రెస్ తరఫున ఎన్నికలలో పోటీ చెయ్యటానికి అవకాశం అడుగుతున్నారు.
ఏప్రిల్ 30 న జరిగే ఎన్నికలలో 119 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంటు స్థానాలకు పోటీలో నిలబెట్టటానికి సీనియర్ నాయకులు సిఫారసులు చెయ్యటంతో పార్టీ సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీకి ఒత్తిడి ఎక్కువైంది. ఈ కింది నాయకులంతా ఆ పనిలో ఉన్నవారే.
తెలంగాణా పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య భోనగిరి తనకి, జనగాం తన కోడలు వైశాలికి అడుగుతున్నారు. వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఉత్తమ కుమార్ రెడ్డి తన భార్య పద్మా రెడ్డికి కోదాడ అడుగుతున్నారు. దామోదర రాజ నర్సింహ భార్య పద్మిని రెడ్డికి సంగారెడ్డి కావాలంటున్నారు. మాజీ పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ తనకి నిజామాబాద్ అర్బన్, తన కుమారుడు సంజయ్ కి నిజామాబాద్ రూరల్ కావాలంటున్నారు. మాజీ మంత్రి జానారెడ్డి తన కుమారుడు రఘు రెడ్డి కోసం మిర్యాలగూడ అసెంబ్లీ సీట్ కోరుతున్నారు. మాజీ హోం మంత్రి సబితా రెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి చేవెళ్ళ పార్లమెంట్ స్థానం కావాలంటున్నారు.
ఇంకా, మాజీ మంత్రులు దామోదర రెడ్డి, ముఖేశ్ గౌడ్, గీతా రెడ్డి, శంకరరావు, రత్నాకర రావులు కూడా తమ పిల్లలకు కాంగ్రెస్ టికెట్ అడుగుతున్నారు.
ఈ విధంగా 40 మంది సీనియర్ నాయకులు తమ పిల్లలు, భార్యలు, దగ్గర బంధువుల కోసం కాంగ్రెస్ పార్టీ టికెట్ అడుగుతున్నారని, ఈ సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నదని సీనియర్ నాయకులంటున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more