ఈ రోజు మలేషియాలోని వార్తాపత్రికలన్నీ సంతాపచిహ్నంగా నల్లరంగుని పులిమి సముద్రంలో కూలిపోయిన పౌర విమానం ఎమ్ హెచ్ 370 లో అసువులు బాసిన 239 మందికి నివాళులర్పించారు.
మలేషియాలోని అత్యధిక సర్క్యులేషన్ లో ఉన్న ఇంగ్లీష్ దిన పత్రిక ది స్టార్ కవర్ నాలుగు వైపులా నల్ల రంగు, దాని మీద ఎమ్ హెచ్ 370 ఆర్ ఐ పి అని, చిన్న అక్షరాలలలో చనిపోయిన వాళ్ళ పేర్లను ముద్రించారు. ది న్యూ స్ట్రైట్స్ టైమ్స్ దిన పత్రిక నల్లరంగు ఫ్రంట్ పేజ్ మీద విమానం దాని కింద గుడ్ నైట్ ఎమ్ హెచ్ 370 అని ముద్రించారు. మార్చి 8న ప్రమాదానికి గురైన విమానం సమాచార వ్యవస్థ తెగిపోక ముందు కాక్ పిట్ నుంచి రికార్డ్ అయిన ఆఖరు మాటలు ఆల్ రైట్ గుడ్ నైట్ అనే మాటలను అవి గుర్తుచేస్తున్నాయి. ది స్టార్ పత్రిక సంపాదకీయంలో, సుదీర్ఘమైన నిరీక్షణకు ఫలితం ఈ రూపంలో వచ్చింది అంటూ రాసింది.
మలయ్ చైనీస్ భాషల్లోని దిన పత్రికలు కూడా నలుపు రంగు బ్యాక్ గ్రౌండ్ లో ఫ్రంట్ పేజ్ ని ముద్రించాయి. సోషల్ నెట్ వర్క్ లో కూడా ట్విట్టర్, ఫేస్ బుక్ లలో చాలామంది మలేషియన్లు నల్ల రంగు బ్యాక్ గ్రౌండ్ తో మృతి చెందినవారికి నివాళులర్పించారు.
మలేషియా అంతా చనిపోయిన వారి కోసం అలా మౌనంగా రోదించింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 13 | తన బిడ్డ అపదలో ఉన్నాడంటే ప్రతీ తల్లి గజేంద్రమోక్ష ఘట్టంలోని శ్రీమహావిష్ణువు రూపం దాల్చి అత్యంత వేగంగా ప్రతిస్పందించి రక్షిస్తుందని అంటారు. తన బిడ్డకు ఆపద వస్తుందంటే అవసరమైతే పులితో కూడా పోట్లాడి.. తన... Read more
Aug 13 | బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక ఖర్గే చేసిన తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు పోందాలంటే యువకులు లంచం ఇవ్వాలి.. యువతులైతే మరో రకంగా సహకరించాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రియాంఖ ఖార్గే... Read more
Aug 13 | దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తున్న సందర్భంగా.. దేశప్రజలందరూ తమ ఇళ్లపై జెండాలను అవిష్కరించాలని ఇప్పటికే జెండాలను కూడా పంచిన క్రమంలో.. వాటితో తమ తమ... Read more
Aug 13 | కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE) పోస్టుల నియాక ప్రక్రియను స్టాఫ్ సెలెక్షన్ కమిటీ (SSC) చేపట్టింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. అర్హులైనవారు వచ్చే నెల 2... Read more
Aug 13 | మరో రెండేళ్లలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే, సీ ఓటర్ సంస్థతో కలిసి చేపట్టిన జాతీయస్థాయి... Read more