ఆధార్ కార్డ్ ని తప్పనిసరి చేసిన ప్రభుత్వం దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ సుప్రీం కోర్ట్ ఈ రోజు ఆదేశాలిచ్చింది.
జస్టిస్ బిఎస్ చౌహాన్ నేతృత్వంలో ధర్మాసనం ఈ రోజు, కోర్టు ఆదేశాలను పాటించకుండా ఇంకా ఆధార్ ని తప్పనిసరి చేస్తున్నారంటూ ఎన్నో లేఖలు వస్తున్నాయని, ఆధార్ లేకపోవటం వలన తన వివాహాన్ని నమోదు చెయ్యటానికి కూడా రిజిస్ట్రార్ నిరాకరించారన్న లేఖ కూడా వచ్చిందని, అలాగే వివిధ రిజిస్ట్రేషన్లు కూడా ఆధార్ లేకపోవటం వలన జరగటం లేదని ఆరోపణలు వస్తున్నాయని, ఒకవేళ అలా ఆధార్ ని తప్పని సరి చేస్తూ ప్రభుత్వ ఆదేశాలేమైనా ఉంటే వాటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
దానితో పాటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా పేరుతో వ్యవహరిస్తున్న ప్రభుత్వ ఏజెన్సీ వాళ్ళు సేకరించిన బయోమెట్రిక్ డేటాను ఎవరికీ అందజేయరాదని కూడా సుప్రీం కోర్టు ఆదేశాలను జారీచేసింది.
ఫొటోతో పాటు రెండు చేతులు పది వేలి ముద్రలు, రెండు కళ్ళలోని కంటి పాప వివరాలు నమోదు చేసుకున్న ఆధార్ సంస్థ 2009 వ సంవత్సరం జనవరి 28 న స్వచ్ఛందంగా వివరాలను ఇచ్చి సంక్షేమ పథకాల ప్రయోజనాన్ని పొందటం కోసం ఆవిర్భవించింది. దానితో పాటే 12 సంఖ్యల నంబర్ ని కూడా కేటాయించటం మొదలుపెట్టింది.
ఆధార్ నంబర్ ని తీసుకోవటం తప్పని చెయ్యరాదని కోర్టులు గతంలో ఎన్నోసార్లు స్పష్టంగా చెప్పటం జరిగింది. అయినా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్ లు ఆధార్ నంబర్ తప్పనిసరిగా కావాలని కోరుతున్నారు. దాని మీద ఆగ్రహించిన సుప్రీం కోర్టు ఆ దిశగా ప్రభుత్వం ఆదేశాలను జారీచేసివున్నట్లయితే వాటిని ఉపసంహరించుకోవాలంటూ ఈ రోజు స్పష్టంగా తెలియజేసింది.
ఆధార్ నంబర్ తీసుకోవటం కోసం ఎంత ప్రచారం చేసారో అది తప్పని సరి కాదని కూడా అంత ప్రచారం చేస్తే కానీ అందరికీ ఆ విషయం జీర్ణం కావటం లేదు అనిపిస్తోంది. అయితే, ఈ మధ్యకాలంలోనే ఆధార్ లింక్ ని వంట గ్యాస్ నుంచి తొలగించటంతో పౌరులకు కొంత అవగాహనైతే వచ్చింది కానీ కార్యాలయాలలో సిబ్బందికి ఇంకా చాలా చోట్ల ఈ విషయం అర్థం కానట్టుగా ఉంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more