మార్చి 14న పవన్ కళ్యాణ్ హైద్రాబాద్ హైటెక్స్ లో జనసేన పార్టీ ఆవిర్భావాన్ని బహిరంగంగా ప్రకటించారు. అందులో కాంగ్రెస్ కి వ్యతిరేక నినాదాలు చేసారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
ఇక తను మొదటి సభలో, మరోసారి కలుస్తానని, ఇంకా వివరాలు ఇస్తానని చెప్పిన ప్రకారమే, మోదీతో భేటీని మిగిలిన పార్టీలు తమకు అనుకూలంగా పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ఉపయోగించుకోక ముందే, మరో సారి పవన్ కళ్యాణ్ తన మనసులోని మాటలను మార్చి 27న బహిర్గతం చెయ్యనున్నారు.
ఈసారి వేదిక విశాఖపట్నం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియమ్. అందులో ప్రత్యేకంగా యువతను ఆకర్షించేవిధంగా పవన్ కళ్యాణ్ ప్రసంగంతో పాటు పాట కూడా తయారవుతోంది. ఈ సారి కూడా పవన్ వేదిక మీద ఒంటిరిగానే ప్రసంగిస్తూ తన ఉద్దేశ్యాలను వెల్లడిచేయబోతున్నారు.
మొదటిసారి చేసిన జనసేన ఆవిర్భావ సభలో ఎన్నికల విషయంలోనూ, పోటీ చేసే విషయంలోనూ ఇంకా తను ఒక నిర్ణయానికి రాలేదని, అయితే తను పదవిని మాత్రం ఆశించటం లేదని, కాంగ్రెస్ ని పడగొట్టటమే తన ధ్యేయమని ప్రకటించారు. అలా కాంగ్రెస్ ని ఓడించే పార్టీలకు తన మద్దతుంటుందని కూడా ఆయన స్పష్టం చేసారు.
ఇప్పటికే కొన్ని టివి ఛానెల్స్ పవన్ మోదీని కలవటం మీద దుమారం లేపాయి. మోదీని కలవటం కోసమే పార్టీ పెట్టాలా, ఒక జాతీయ పార్టీలో కలవటానికి అంత హడావిడి, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉద్వేగంతో ప్రసంగించాలా అంటూ విమర్శలను గుప్పించాయి.
ఇలాంటి నిందలకు స్వస్థి వాక్యాలు పలుకుతూ, తన మనసులోని మాటలు, తన భవిష్యత్ కార్యాచరణను విస్పష్టంగా తెలియజేయటానికే పవన్ కళ్యాణ్ రెండవ సభను నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more