మలేషియాకు చెందిన ఎమ్ హెచ్ 370 పౌర విమానం కౌలాలంపూర్ లో చైనా లోని బీజింగ్ లక్ష్యంగా బయలుదేరి రెండు వారాలు కావొస్తోంది కానీ లక్ష్యాన్ని చేరలేదు, ఆచూకీ తెలియలేదు. ప్రయాణీకుల బంధువులు సమాచారాన్ని సరిగ్గా అందించటం లేదని వేదన చెందుతూ మలేషియా ప్రభుత్వాన్ని ఆరోపిస్తున్నారు. బీజింగ్ లో లిడో హోటల్లో మలేషియన్ అధికారులతో జరిగిన భేటీలో ప్రయాణీకుల కుటుంబీకులకు ఎటువంటి స్వాంతనా లభించలేదు. అధికారులు ఏదో దాస్తున్నారని అనుమానాలను వెలిబుచ్చుతున్నారు. చైనా నేవల్ షిప్స్ కూడా గాలింపు చర్యలో అక్కడికి బయలుదేరుతున్నాయి.
ప్రపంచ దేశాలన్నీ వెతుకుతున్న ఆ విమానం ఆచూకీ దొరికినట్లే దొరికి చేతికి చిక్కటం లేదు. ఎన్ని రకాలుగా దర్యాప్తు చేసినా ఏ చిన్న క్లూని వదిలిపెట్టకుండా ప్రతి కోణంలోనూ గాలింపు చర్యలు చేపట్టినా చివరకు అవన్నీ ఫలితాన్నివ్వలేకపోయాయి.
వియత్నాం దగ్గర సముద్రంలో విమాన శకలాలు ఉన్నాయన్న రిపోర్ట్ ఒట్టిదైంది. సముద్రమంతా గాలించినా దొరక్క గాలించే ప్రదేశాన్ని విస్తృతం చేస్తూ వస్తున్నా లాభం లేకపోతోంది. శాటిలైట్ చిత్రాలలో ఆస్ట్రేలియా దగ్గర హిందూమహా సముద్రంలో కొన్ని శకలాలు కనిపిస్తే రెండు రోజులుగా అక్కడ గాలించటం మొదలుపెట్టారు. చివరకు అది కూడా ఎండమావిలా అక్కడేమీ లేకుండానే అనవసరమైన ప్రయాసను తెచ్చిపెడుతూ నీరసపరుస్తోంది. అయినా మరోరోజు గాలింపు చర్యలను కొనసాగిస్తామంటున్నారు.
239 మందితో అంతర్థానమైన విమానం కోసం ప్రస్తుతం ఐదు విమానాలు దక్షిణ హిందూ మహా సముద్రం ప్రాంతంలో వెతుకుతున్నాయి. 239 మందిలో 12 మంది విమాన సిబ్బంది కాగా 154 మంది చైనా దేశస్తులే. మిగిలినవారిలో వివిధ దేశాలవారున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more