Party workers did not leave congress chiranjeevi says

Party workers did not leave Congress Chiranjeevi says, Congress bus yatra, Raghuvera Reddy, Pallam Raju, C Ramachanraiah

Party workers did not leave Congress Chiranjeevi says

కాంగ్రెస్ కార్యకర్తలు వీడిపోలేదు- చిరంజీవి

Posted: 03/21/2014 03:33 PM IST
Party workers did not leave congress chiranjeevi says

ఈరోజు కాంగ్రెస్ నేతల బస్సు యాత్రలో పాల్గొన్న చిరంజీవి శ్రీకాకుళంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ఖాళీ అయిపోయిందని అంటున్న ఇతర పార్టీల మాటలు సరైనవి కావని, నేతలు కొందరు వీడినా, పార్టీ కార్యకర్తలు మాత్రం పార్టీని విడిచిపోలేదని అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సారధిగా బాధ్యతలను మోస్తున్న కేంద్ర మంత్రి చిరంజీవి, వ్యక్తిత్వం ఉంది కాబట్టే తాను కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్రలో పనిచేస్తున్నానని అన్నారు. 

ఏపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుంచి బయలుదేరిన కాంగ్రెస్ బస్సు యాత్రలో పదేళ్ళగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సేవల మీద తయారు చేసిన కరపత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తున్నామన్న రఘవీరా రెడ్డి,  రాబోయే పదేళ్ళలో రాష్ట్రంలో పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందుతాయన్నారు.  రాష్ట్రాన్ని విభజించమని వివిధ పార్టీలు లేఖలివ్వబట్టే కాంగ్రెస్ పార్టీ విభజించిందని ఆ లేఖల ప్రతులను చూపించారు రఘువీరా రెడ్డి. 

బస్సు యాత్రలో రఘువీరారెడ్డి చిరంజీవితోపాటు ఉత్సాహంగా పళ్ళం రాజు, ఆనం రామనారాయణ రెడ్డి, ద్రోణంరాజు శ్రీనివాస్, సి.రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. 

అయితే దీనికి ప్రతిగా కాంగ్రెస్ మరో 30 సంవత్సరాల వరకు రాష్ట్రంలో ఉండదని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు.  భారతీయ జనతా పార్టీలో చేరిన పురంధేశ్వరి కూడా విజయవాడలో మాట్లాడుతూ, రాష్ట్ర విభజనకు పూనుకున్న కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టారు. 

ఈరోజు శ్రీకాకుళం నుంచి బయలుదేరిన కాంగ్రెస్ బస్ యాత్రలో పాల్గొన్న చిరంజీవి, కాంగ్రెస్ పార్టీ పడిపోయిందని తప్పు ప్రచారాలు జరుగుతున్నాయని, అది సరి కాదని, ప్రజలు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారన్న విషయాన్ని నిరూపించాలంటూ పిలుపునిచ్చారు.   

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles