శేషాచలం కొండల్లో మొత్తం 37 ప్రాంతంలో మంటలు చెలరేగుతున్నాయని, వాటిని అదుపు చెయ్యటం ఇప్పట్లో సాధ్యం కాని పని అని ఫైర్ డిజి సాంబశివరావు తెలియజేసారు. మంటలు ఆర్పటంలో కలిగే కష్టనష్టాలే కాకుండా అందులో చిక్కుకునివున్న క్రూర మృగాల వలన కూడా సిబ్బందికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నందున అందుకు అవసరమైన మత్తు పదార్దాలను ఇతర భద్రతా సామగ్రిని కూడా తీసుకుని వెళ్ళవలసివుంటుంది. మొత్తానికి పట్టణాలు, నగరాలలో మంటలు ఆర్పటానికి సుశిక్షితులైన ఫైర్ సిబ్బందికి అడవిలో మంటలు ఆర్పటం పెను సవాల్ ని విసురుతోంది.
శేషాచలం అడవులలో చెలరేగిపోతున్న కార్చిచ్చును అదుపులోకి తీసుకునిరావటానికి వెళ్ళిన సిబ్బంది దాని ప్రకోపానికి భయపడి వెనకడుగులు వడివడిగా వేసారు. కేంద్రం పంపించిన సిబ్బంది వారితో పాటు అక్కడకు వెళ్ళిన తితిదే అధికారులు, మీడియా ప్రతినిధులను కూడా మంటలు చుట్టుముట్టటంతో భయభ్రాంతులయ్యారు. అయితే ఒక పక్కనుంచి జాగ్రత్తగా మంటలను అదుపు చెయ్యటంతో వాళ్ళు బయటపడగలిగారు.
అగ్ని కీలల వలన వ్యాపిస్తున్న మంటలే కాకుండా పెరిగిపోతున్న వేడి మంటలార్పాటానికి పూనుకున్న సిబ్బందికి హడలెత్తిస్తోంది. రెండు రోజులుగా ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో చెలరేగుతున్న మంటలు ఆలయ చరిత్రలో మొదటిసారిగా అధికారులను, భక్తులను భయభ్రాంతులను చేస్తోంది.
అమూల్యమైన వృక్షసంపదే కాకుండా, గాలి మరల ప్రాజెక్ట్ కి ఇప్పటి వరకు 90 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా ప్రాధమిక అంచనాలో తేలింది.
జరుగుతున్న ప్రకృతి భీభత్సం, తిరుమలకు పొంచివున్న ప్రమాదం మీద తితిదే అధికారులు ఇప్పిటికే గవర్నర్ నరసింహన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో సంప్రదింపులు జరిపామని అన్నారు.
దావానలంతో తిరుమల భక్తులకు అడ్డంకులు
తిరుమల కొండలలో చెలరేగుతున్న మంటల వలన తిరుమల భక్తుల నడకదార్లు రెండిటినీ, పాపనాశనానికి వెళ్ళే దారి కూడా మూసివేయటం జరిగింది. అయితే భక్తులు భీతిచెందవద్దని తితిదే ఈవో అంటున్నారు. 500 మంది నిరంతరం శ్రమిస్తున్నా మంటలు అదుపులోకి రావటం లేదు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more