భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి చండీగఢ్ కి వెళ్ళిన సినిమా నటులు, భార్యా భర్తలైన కిరణ్ ఖేర్, అనుపమ్ ఖేర్ల మీద కోడి గుడ్లు పడ్డాయి.
అవి ఎవరో వైరి పక్షాల నుంచి వచ్చిపడ్డ గుడ్లనుకుంటే పచ్చి గుడ్ల మీద కాలు వేసినట్లే. అవి భాజపా నాయకులు సంధించిన గుడ్లే. పోలీసులు రంగంలోకి దిగి, దాడికి కారకులైన భాజపా కార్యకర్తలను అదుపులోకి తీసుకుని వాళ్ళ దగ్గర మిగిలిన కోడిగుడ్లను జప్తు చేసారు. వాటిని ఎలాగూ మా మీద వెయ్యటానికి తెచ్చినవే కాబట్టి వాటిని మాకు స్వాధీనం చెయ్యండని అనుపమ్ ఖేర్ అన్నారు. కాదు జప్తు చెయ్యబడ్డవి కాబట్టి అవి ప్రభుత్వ ఆస్తి అవుతాయని పోలీసులు వాటిని ఇవ్వటానికి నిరాకరించారు.
కిరణ్ ఖేర్ నామినేషన్ మీద గుడ్లురిమిన చండీగఢ్ భాజపా అధ్యక్షుడు సంజయ్ టండన్, మాజీ ఎంపీ సత్యపాల్ జైన్, మాజీ కేంద్ర మంత్రి హర్మోహన్ ధవన్ ల పనే అలా గుడ్లు విసరటం. వాళ్ళు చండీఘడ్ పార్టీ టికెట్ కోసం ఆశిస్తుంటే వాళ్ళందరినీ కాదని పార్టీ కిరణ్ ఖేర్ కి అవకాశమిచ్చింది. అదీ వాళ్ళ కోపం. దానికి వాళ్లు ఆమె చండీఘడ్ కి చెందినావిడ కాదన్న ఆరోపణను ముసుగు వేసారు. గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్లుంది కిరణ్ ఖేర్ రావటం అన్నారు వాళ్ళు. ఇంతలో ఆ ముగ్గురి భార్యలు కూడా రంగ ప్రవేశం చేసారు. ఇంట్లో కిచెన్ లో పెట్టిన గుడ్లను పరాయి ఆడవాళ్ళకి ఇస్తారా అంటూ తమ భర్తలతో తగువుకి వచ్చారు.
అయితే కిరణ్ ఖేర్ వాళ్ళ దురభిప్రాయాన్ని పోగొడతానని, తాను చండీఘఢ్ కి చెందిన దాన్నేనని నచ్చజెప్తానని అన్నారు. ఇది నేను పుట్టిన ప్రదేశం, ఇది నా మాతృభూమి కాదని ఎలా అంటారు అని అడిగారామె. ఈ గుడ్ల ను ఏ దుకాణంలో కొన్నారో కూడా చెప్పగలను తెలుసా అన్నారు. అనుపమ్ ఖేర్ కిరణ్ ఖేర్ గురించి మాట్లాడుతూ ఆమె పంజాబీ కుడి అని ఆమె పార్టీ కోసం చాలా సేవ చేసిందని, దేన్నైనా ధైర్యంగా ఎదుర్కుంటుందని, ఇలాంటి గుడ్లను పార్టీ తరఫున బయటి పార్టీ నాయకుల మీద ఎన్నో సార్లు వేసిందని అన్నారు. అండే అండే పే లిక్ఖా హై ఖానే వాలే కా నామ్ (ప్రతి గుడ్డు మీదా దాన్ని తినేవాళ్ళ పేరు రాసిపెట్టివుంటుంది) అని కూడా అన్నారు అనుపమ్ ఖేర్.
అంతేకాదు మామూలుగా అయితే కిరణ్ చాలా ఉగ్ర స్వభావం కలదని, బయటకు రాబట్టి ప్రశాంతంగా ఉండి తనను కూడా మాట్లాడనిస్తోందని అన్న అనుపమ్ ఖేర్, అదే ఇంట్లో ఉండేట్టుగా బయట కూడా ఉండివుంటే మీరు వేసిన గుడ్లన్నీ ఆమ్లెట్లైపోయి వుండేవి తెలుసా అన్నారు.
పోలీసులు కలుగజేసుకోవటంతో గుడ్ల వాన ఆగిపోయింది. కిందంతా చితచితలైనా పార్టీ తరఫున చెప్పదలచుకున్న నాలుగు ముక్కలనూ చెప్ప గలిగారు ఆ తర్వాత. గుడ్లతో చేసిన ఇళ్ళల్లో ఉన్నవారు ఒకరి మీద మరొకరు రాళ్ళు విసురుకోగూడదన్న సత్యాన్ని వాళ్ళకి తెలియజేసారు.
గాడిద గుడ్డేం కాదు అంటూ నిరసనకారులు అక్కడి నుండి వెళ్ళిపోయారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more