తెలంగాణా ప్రాంతంలో కానీ సీమాంధ్రలో కానీ వలసలు పోయినవాళ్ళని తిరిగి రమ్మని చెప్తూ, పోదామనుకుంటున్నవాళ్ళని ఆగమని చెప్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శిథిలం కాకుండా కాపాడుకునే ప్రయత్నంలో పడ్డారు రాష్ట్ర ఉభయ పిసిసి అధ్యక్షులు.
తెరాస లో కలిసే ఆలోచనలో ఉన్న పఠాన్ చెరువు ఎమ్మెల్యే నాదేశ్వర్ గౌడ్ ని తెలంగాణా పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విజయవంతంగా కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయేట్టుగా చెయ్యగలిగారు. అలాగే వరంగల్ జిల్లాలో దృష్టిపెట్టిన పొన్నాల కొండా సురేఖ దంపతులను తెరాస లోకి పోకుండా చెయ్యటానికి ఉదయం వాళ్ళతో సమావేశమయ్యారు.
అలాగే సీమాంధ్రలో పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా చురుగ్గా పావులు కదిపే పనిలో పడ్డారు. ఈరోజు కోత్తగా ఏపిసిసి కి కేటాయించిన ఇందిరా భవన్ లో జరిపిన మీడియా సమావేశంలో రఘువీరా రెడ్డితో పాటు ప్రచార సారధిగా పగ్గాలు చేపట్టిన చిరంజీవి, సి.రామచంద్రయ్య, ఆనం రాం నారాయణ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ నెల 21 నుంచి 27 వరకు బస్సు యాత్రను నిర్వహిస్తున్నట్లుగా తెలియజేసారు.
ఈ సందర్భలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కానీ కాంగ్రెస్ జెండా మోసే కార్యకర్తలకు కానీ కొదవు లేదని అన్నారు. పార్టీలోంచి బయటకు వెళ్ళినవారికి వెళ్ళబోతున్నవారికీ రఘువీరా రెడ్డి తిరిగి పార్టీలోకి రమ్మని పిలుపునిచ్చారు. బస్సు యాత్రలో పాల్గొనదలచుకున్నవాళ్లు కార్యకర్తల నుండి దరఖాస్తులను తీసుకోవలసిందిగా కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు లేని ప్రాంతాల్లో కొత్త నాయకులకు అవకాశం కలిగిస్తామని కూడా రఘువీరా రెడ్డి తెలియజేసారు. ఈ నెల 21న శ్రీకాకుళం విజయనగరాలలో కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తామని కూడా ప్రకటించారు.
కాంగ్రెస్ ని నామరూపాలు లేకుండా చెయ్యాలని అన్ని పార్టీలు కత్తికట్టిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎలా నిలదొక్కుకుంటుందన్నది ఆసక్తికరమైన విషయమే!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more