రాష్ట్ర విభజన నేపథ్యంలో వనరులు, ఉద్యోగులు, ఆస్తులు, అప్పులే కాకుండా ఖైదీల విభజన కూడా చోటు చేసుకుంటోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆయా ఖైదీలు ఏ ప్రాంతానికి చెందినవారో తెలియజేయమంటూ ఆంధ్రప్రదేశ్ కారాగార శాఖ సర్క్యులర్ పంపించింది.
అందిన సమాచారాన్నిబట్టి ఆయా ఖైదీలను తెలంగాణాలోకి పంపించాలా లేక ఆంధ్రప్రదేశ్ లోకా అన్నది నిర్ణయిస్తారు.
దీనికి కారణం క్షమాభిక్షలాంటి నిర్ణయాలు ఒక రాష్ట్రం తీసుకున్నప్పుడు అది ఆ రాష్ట్రానికి చెందుతుంది కానీ ఆ రాష్ట్రంలోని జైళ్ళలో ఉన్న ఖైదీలు ఏ ప్రాంతానికి చెందినవారన్నదాన్నిబట్టి కాదు. ఈ సంగతి వివరించిన కారాగారాలను సరిదిద్దటానికున్న శాఖ ఐజిపి బి సునీల్ కుమార్, ఉదాహరణకు తెలంగాణా ఒక ఆదేశాన్ని ప్రకటించిందనుకోండి, అది ఆ రాష్ట్రంలోని అన్ని జైళ్ళకు వర్తిస్తుంది కానీ అందులోని ఖైదీలు ఏ ప్రాంతానికి చెందినవారన్నదాన్నిబట్టికాదు అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో 4900 మంది వివిధ కారాగారాలలో ఉన్నారు. అయితే ప్రకాశం జిల్లా నుంచి ఐదుగురు ఖైదీలు వాళ్ళని చర్లపల్లి జైలుకి మార్చమని కోరారు కారణం- వాళ్ళ బంధువులు హైద్రాబాద్ లో ఉంటున్నారు కాబట్టి. అలాగే వరంగల్ లో ఉన్న ఇద్దరు ఖైదీల కోరిక మీద వాళ్ళని అనంతపూర్ జైలుకి పంపించటం జరిగింది అని చెప్పారు సునీల్ కుమార్. ఇలాంటి వాళ్ళు 50 మంది ఖైదీల వరకు ఉండవచ్చని అన్నారు ఐజిపి.
అయితే వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు పంపటమనేది కేవలం ఖైదీల విషయంలోనే జరుగుతుందని, విచారణలో ఉన్నవారి విషయంలో బదిలీలకు ఆయా కోర్టులే నిర్ణయాలు తీసుకుంటాయని కూడా ఐజిపి తెలియజేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more