అఖిలభారత కాంగ్రెస్ పార్టీ ఛీఫ్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ శుక్రవారం చేసిన మీడియా సమావేశంలో కాకుండా దాని తర్వాత మీడియా ప్రతినిధులతో చేసిన పిచ్చాపాటీ సంభాషణలో కెసిఆర్ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారనే సంకేతాలిచ్చారు.
ఒకవేళ తెలంగాణా రాష్ట్ర సమితిని కాంగ్రెస్ లో విలీనం చెయ్యవలసివస్తే తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు తనకి ముఖ్యమంత్రి పదవి కావాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. విభజన బిల్లు లోని అంశాలతో విభేదించటం వలన కెసిఆర్ కాంగ్రెస్ కి దూరమయ్యారా అని అడిగిన ప్రశ్నకు దిగ్విజయ్ సింగ్, అలాంటిదేమీ లేదని, విభజన బిల్లులోని అన్ని అంశాలతోనూ ఆయన పూర్తిగా ఏకీభవించారని ఆయన అన్నారు.
అయితే ఈ విషయాన్ని కెసిఆర్ అధిష్టానం దగ్గర వెల్లడి చెయ్యలేదన్న విషయాన్ని కూడా దిగ్విజయ్ సింగ్ అంతకు ముందు అన్నారు.
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ కాంగ్రెస్ లో విలీనం చేస్తానని అనటానికి తెరాసకు కారణాలు వెతుక్కోవటం కూడా కష్టమౌతుంది. కెసిఆర్ కి ముఖ్యమంత్రి పదవినస్తానన్నారని, అందుకే విలీనం చేస్తున్నామనైతే చెప్పలేరు కదా.
తెరాస వస్తే కెసిఆర్ కి ఎలాగ వచ్చేది ముఖ్యమంత్రి పదవే. దాన్ని ఆయనకు మరే పార్టీ ఇవ్వనక్కర్లేదు. కానీ భాజపా, కాంగ్రెస్, తెదేపాలు, మధ్యలో పవన్ కళ్యాణ్ ఎంట్రీతో ఏమవుతుందో అన్న భయం ఉండటం సహజం. ఫలితాలు వచ్చేంతవరకూ ఎన్నికలలో ఏం జరుగుతుందన్నది చెప్పటం కష్టం. అందువలన కచ్చితంగా ముఖ్యమంత్రి పదవి వస్తుందంటే కాంగ్రెస్ లో చేరటమా లేకపోతే తెలంగాణాలో ఇంకా బలం పెంచుకుని ముఖ్యమంత్రి పదవిని తానే సంపాదించుకోవటమా అన్నది కెసిఆర్ ఆలోచించవలసివస్తుంది.
కాంగ్రెస్ లో విలీనం చేస్తే కెసిఆర్ కి ముఖ్యమంత్రి పదవి ఒకవేళ లభించినా పార్టీని నమ్ముకునివున్న మిగతా నాయకుల సంగతి ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నాయకులకు చోటు కల్పించటం కూడా తప్పనిసరే.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more