అనటమెందుకు, అనిపించుకోవటమెందుకన్నట్లు, నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ తో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ పోలుస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సూటిగా, వాడిగా, దీటుగా భాజపా సమాధానం చెప్పింది.
భారతీయ జనతా పార్టీ నాయకుడు ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ హిట్లర్ వారసులు ఎవరైనా మనదేశంలో పుట్టుంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీలోనని అన్నారు. హిట్లరనటం మోదీని అవమానవరచటమవుతుందని, మన దేశంలో ఎవరైనా హిట్లర్ లా ప్రవర్తించివుంటే అది కేవలం రాహుల్ నానమ్మ ఇందిరా గాంధీయేనని ఆయనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే హిట్లర్ లా ప్రవర్తిస్తోందని కూడా ఆయన అన్నారు.
మంగళావారం గుజరాత్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ మోదీని ఉద్దేశించి, అన్నీ తనకే తెలుసని, ప్రజలకు ఏమీ తెలియదని అనుకున్న హిట్లర్ లాంటి రెండవ హిట్లరని అన్నారు. రైతుల భూమూలను కాజేసి పెద్ద పెద్ద సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని ఆయన అరోపించారు. ఎంతసేపు నేనిది చేసాను, నేనది చేసానని అనటమే కానీ ప్రజల దగ్గరకు పోయి వాళ్ళ కేం కావాలన్నది చూడలేదని విమర్శించారు రాహుల్ గాంధీ.
గతంలో న్యాయశాఖా మంత్రి సల్మాన్ ఖురేషీ మోదీని నపుంసకుడనటం వివాదానికి దారితీసింది, అలా అనటం తప్పే అని కూడా రాహుల్ గాంధీ అన్నారు. కానీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇప్పుడు ఆయన కూడా ఎదుటివారిని కించపరచటం, తక్కువ చేయటం ద్వారా తన స్థాయిని పెంచుకోవటమనేది చేస్తున్నారు.
అది న్యూటన్ కనుగొన్న సాపేక్ష సిద్ధాంతం లోకి వస్తుంది. పెద్ద చిన్న అన్నది పోలికతోనే ఉంటుంది కాబట్టి ఎదుటి మనిషిని చిన్నగా చేస్తే తాను ఆ మనిషితో పోలికలో పెద్ద అవుతారన్నది రాజకీయాలలో సాపేక్ష సిద్ధాంతం. కానీ ఈ ప్రక్రియలో దివంగతులైన నాయకులను కూడా బయటకు ఈడ్చటం, వారిమీద కూడా బురద చల్లించటం జరుగుతోంది. రాహుల్ మాటల వలన చరిత్రను తవ్వి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు చెయ్యటం జరిగింది అదీ ఆమె మనుమడి ద్వారా.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more