నందమూరి బాలకృష్ణ ఒకవేళ ఎన్నికలలో పోటీ చేస్తానంటే మాత్రం ఆయనకు సీటు ఖరారు చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంగళవారం ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు. అది కూడా ఆయన ఏది కోరుకుంటే అది- శాసనసభకు కాని లోక్ సభకు కానీ ప్రాతినిధ్యం వహించవచ్చని చంద్రబాబు అన్నారు.
ఈరోజు విశాఖపట్నంలో జరుగనున్న ప్రజాగర్జన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.30 కి విశాఖపట్నం చేరనున్న చంద్రబాబు, మధ్యాహ్నం 3.30 గంటలకు పూర్ణ మార్కెట్, టౌన్ కొత్తరోడ్, సీ హార్సెస్ మీదుగా ఇందిరా ప్రియదర్శిని మినీ స్టేడియం వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్తారు. చంద్రబాబు నాయుడు ప్రసంగం సాయంత్రం 5.00 గంటలకు ప్రారంభమౌతుంది.
ఎప్పుడూ ఆధునికతవైపు మొగ్గు చూపే చంద్రబాబు నాయుడు ఈసారి పార్టీలో అభ్యర్థుల ఎంపికను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చేస్తున్నామని తెలియజేసారు. దేశంలోనే మొదటిసారిగా చేసే ఈ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను ప్రజలు మెచ్చే నాయకుడిని ఆ ప్రాంతంలో నిలబెట్టే విధంగా ఉంటుందని కూడా ఆయన అన్నారు.
ప్రజాగర్జన సభలో చంద్రబాబు సమక్షంలో లాంఛనప్రాయంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్, అవంతి శ్రీనివాస్, వెంకట్రామయ్య, రమణమూర్తి రాజు తెలుగు దేశం పార్టీ లో చేరుతారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more