మంగళవారం హైద్రాబాద్ నిజాం కాలేజ్ మైదానంలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణా ఆవిర్భవించిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభ కార్యక్రమంలో ప్రసంగించిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ మాటతడబడి యుపిఏ గీతం ఆలాపించారు. తెలుగులో ముక్కలను ముక్కున పెట్టుకుని వల్లించిన రాజ్ నాథ్ సింగ్ దృష్టంతా ఆ భట్టీపట్టిన ముక్కల మీదనే ఉండటం వల్లనేమో అసలు విషయానికి వచ్చేసరికి తడబడ్డారు.
సోదర సోదరీమణులారా, కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యుపిఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అప్పుడు మేము తెలంగాణా కష్టాలను, సీమాంధ్ర కష్టాలను దూరం చేస్తాం. రెండు రాష్ట్రాలకూ న్యాయం చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను అని అనేటప్పటికి వేదికను అలంకరించిన పెద్దలు, సభను అలంకరించిన ఔత్సాహికులు అందరూ ఉలిక్కిపడ్డారు.
అంతకు ముందు వరకు ఆయన తెలుగులో బాగానే మాట్లాడారు. సోదర సోదరీమణులారా తెలంగాణా రాష్ట్రం వచ్చిన సందర్భంలో తెలంగాణా ప్రజలందరికీ మా శుభాకాంక్షలు. మేము మాట ఇచ్చాం, తెలంగాణాకు మద్దతిచ్చాం. అవునా కాదా అని అనగానే అందరూ అవును అని అరిచారు. 2006 లో ఇదే వేదిక మీద తెలంగాణా వస్తుందని మాటిచ్చామని, దానికి కట్టుబడి మద్దుతునిచ్చామని ఆయన సభికులకు గుర్తుచేసారు.
ఆ తరువాత నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతూ, ఆయన మీద జరిగినన్ని దాడులు మరెవరిమీదా జరగలేదని, భగవంతుడు పెట్టిన పరీక్షలో ఆయన నిలదొక్కుకున్నారని అన్న రాజ్ నాథ్ సింగ్, వజ్రాన్ని సానబెడితే మెరిసినట్లుగా ఎంత విమర్శలకు లోనుచేస్తే ఆయన అంతగా రాణించి ప్రజలకు దగ్గరౌతున్నారని అన్నారు రాజ్ నాథ్ సింగ్. అందుకే కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని నెలకొల్పటానికి కంకణం కట్టుకున్న భాజపా కు మద్దతుగా ఇటు తెలంగాణా అటు సీమాంధ్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నామని సుస్థిరమైన ప్రభుత్వాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నంలో మాకు అవకాశం ఇవ్వండని చెప్తూ, తెలంగాణా ఏర్పాటులోను, నిర్మాణంలోనూ, అభివృద్ధిలోనూ భాజపా భాగం వహిస్తుందని, అందువలన మోదీని గెలిపించండని ఆయన కోరారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more