యూరప్ లోని ప్రాథమిక హక్కుల ఏజెన్సీ (ఎఫ్ఆర్ఏ) చేసిన సర్వేలో మూడో వంతు మహిళలు హింసాత్మక చర్యలకు బలౌతున్నారని తేలి అందరినీ ఆశ్చర్యపరచింది. 15 సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర్నుంచీ మూడోవంతు మహిళలు మగవాళ్ళ చేతిలో భౌతికంగా హింసను అనుభవిస్తున్నారని, మానసిక వేదనను అనుభవించేవారు 45 శాతం వరకు ఉన్నారని 42000 మహిళలతో ఇంటర్వ్యూ చేసిన ఆ సర్వేలో తేలింది.
ఎఫ్ఆర్ఏ లో స్వాతంత్రం, న్యాయపరిరక్షణ శాఖకు నాయకత్వం వహిస్తున్న జోన్నా గూడీ బ్రుస్సెల్ లో ఉన్న యూరోపియన్ పార్లమెంట్ ఇంటర్ పార్లమెంటరీ కమిటీకి ఈ విషయంలో నివేదికను అందజేసారు.
ఈ నివేదికను చూసిన తర్వాత సమాజంలో మహిళలమీద అత్యాచారం, హింసాకాండలు సమ్మతించగూడదని, ప్రతివారు తమ సొంత విషయంలా భావించకుండా అటువంటి సమాజాన్ని నిర్మించటంలో సహయోగం, భాగం వహించటం అవసరమని భావిస్తున్నారు. ఈ సర్వేని తేలిగ్గా తీసుకోగూడదని, యూరోపియన్ దేశాలలో మహిళల పట్ల జరుగుతున్న అకృత్యాలను అరికట్టటం అవసరమని ఎఫ్ఆర్ఏ భావిస్తోంది.
మహిళలను ఇబ్బందికి గురిచేసే వాటిలో వాళ్ళు 15 సంవత్సరాల ప్రాయం నుంచే వాళ్ళని తేరిపార చూస్తూ అనుసరించటం, పనిచేసే ప్రదేశాలలో చేతులు తగిలించటం, హత్తుకోవటం, ఇమెయిల్స్ పంపించటం, అసభ్యకరమైన పోజుల్లో కనిపించటం ఉన్నాయి. 45 నుంచి 55 శాతం వరకు లైంగిక వేధింపులకు కూడా గురయినవారున్నారు. 20 శాతం మంది సైబర్ హెరాస్ మెంటు చేస్తున్నారని చెప్పారు. సర్వే చేసినవారిలో 5 శాతం మంది వాళ్ళ 15 సంవత్సరాల వయసు నుంచే లైంగిక అత్యాచారాలకు గురౌతూ వస్తున్నామన్నారు. 14 శాతం మంది తమ జీవిత భాగస్వాముల నుండే హింసాత్మక దాడులు వస్తున్నాయని అంటున్నారు.
సర్వే నివేదికతోపాటుగా పోలీసులకు మహిళల మీద జరిగే హింసాకాండల విషయంలో తగిన అవగాహన, వాటిని నిరోధించటంలో శిక్షణ ఉండాలని, నేరస్తులను అదుపు చేయటానికి అవసరమైన అధికారాలను కూడా వాళ్ళకివ్వాలని సూచించటం జరిగింది. ఇంటర్ నెట్, స్మార్ట్ ఫోన్ల ద్వారా జరిగే వేధింపులను అరికట్టటానికి నేరాలను అరికట్టే శాఖలకు తగిన సాంకేతిక అవగాహన కూడా ఉండాలని కూడా సలహా ఇవ్వటం జరిగింది.
సర్వేలో తేలిన పూర్తి వివరాలను యూరప్ లోని దేశాల వారీగా ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంచారు సర్వే నిర్వహించిన ఏజెన్సీ ఎఫ్ఆర్ఏ.
అయితే ఇది అంతటా ఉందిలే అని మనం మన దేశంలో మహిళలు ఎదుర్కుంటున్న వేధింపులను సమర్థించుకోవటం కాదు. దీనికి తరుణోపాయమేమిటన్నది ఏ దేశమైనా ప్రపంచానికి సూచించవచ్చు. దీన్ని గ్లోబల్ వార్మింగ్ డీఫారెస్టేషన్ లాంటి ప్రపంచం సమస్యగా గుర్తించి మేధావులంతా కూర్చుని పరిష్కరించవలసిన అవసరం ఉంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more