సమైక్యాంధ్రప్రదేశ్ లో చివరివరకూ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి రాజీనామా చేసిన కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్నది చర్చించటానికి ఈరోజు ఆమె తన నియోజకవర్గం విశాఖపట్నంలో తన నివాసంలో తనతో పాటు పనిచేసిన కార్యకర్తలు నాయకులతో చర్చిస్తున్నారు.
చర్చల ఫలితంగా భాజపాలో చేరటానికే ఆమె నిర్ణయం తీసుకున్నారని, రేపు ఢిల్లీలో భాజపాలో అగ్రనేతల సమక్షంలో
ఏ నాయకుడు కానీ నాయకురాలు కానీ రాజకీయాలలో ఒంటరిగా పోరాడలేరు. వారికి అండదండలుగా నిలిచిన పార్టీ శ్రేణులు కూడా వారి నిర్ణయాల వలన ప్రభావితులవుతారు కాబట్టి నాయకులకు వారితో చర్చించటం తప్పనిసరి అవుతుంది. రాజీనామాను అస్త్రంగా ఉపయోగించుకుంటే పరవాలేదు కానీ నిజంగానే రాజీనామా చేసినప్పుడు ఆ నాయకుల మీద ఆధారపడ్డ ఇతర నాయకుల రాజకీయ భవిష్యత్తు కూడా అగమ్య గోచరమౌతుంది.
రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందినప్పుడు రాజీనామా చెయ్యటం ఆ పరిస్థితుల్లో తన నియోజకవర్గ ప్రజల ఆదరణ పోగొట్టుకోకుండా ఉండాలంటే వారి మనోభీష్టానికి తగ్గట్టుగా అలా చెయ్యటం తప్పనిసరి అని రాజకీయ వర్గాలు అర్థం చేసుకోగలవు.
కానీ ప్రస్తుతం ఆమె నిర్ణయం ఏమిటన్నది ఆమె అనుచరులకు ఆసక్తికరంగా మారింది. విశాఖపట్నం నాదే, ఇక్కడి నుండే పోటీ చేస్తానంటూ రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డితో సవాల్ చేసిన పురంధేశ్వరి రాజీనామా చెయ్యటంతో సుబ్బరామిరెడ్డికి లైన్ క్లియరైంది కానీ పురంధేశ్వరి ట్రాక్ ఎండ్ కి వచ్చారు.
తన తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుతో ఉన్న విభేదాల వలన ఆమె కనీ ఆమె భర్త కానీ చేరలేరు. ఇక మిగిలిన పార్టీలతో చేరతారా లేక ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. లోగడ తెలుగుదేశంతో కలిసే ప్రస్తావన వచ్చినప్పుడు పురంధేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావులు మీడియా ముందుకొచ్చి తాము కాంగ్రెస్ పార్టీలో సంతోషంగా ఉన్నామని, పార్టీ తమకిచ్చిన గౌరవం, హోదాలతో సంతృప్తికరంగా ఉన్నామని ప్రకటించారు.
ప్రత్యామ్నాయంగా పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీలో చేరటానికే అవకాశాలున్నాయి. ఈ రోజు ఆమె పార్టీ అనుచరుల సమక్షంలో అందుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more