ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జనవరి 11, 1973 లో జై ఆంధ్రా ఉద్యమం జరిగి ఆ తరుణంలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యటానికి కావలసిన మద్దతు లేకపోవటంతో రాష్ట్రపతి పాలన విధించటం జరిగింది.
ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా వలన ఏర్పడిన సంక్షోభంతో తిరిగి రాష్ట్రపతి విధించటానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదించటంతో ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుంటోంది.
భారత రాజ్యాంగంలోని 356 అధికరణ ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం నడిచే పరిస్థితి లేకపోతే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఆ సమయంలో మామూలుగా ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యంతో ఎన్నికైన ముఖ్యమంత్రి ఆయన సహాయక మంత్రులతో రాష్ట్ర పాలన నడపకుండా ఆ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ పాలన కిందికి వస్తుంది. అప్పుడు రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో తనకు సహాయంగా పనిచెయ్యటం కోసం పదవీ విరమణ చేసిన ఉద్యోగులను కానీ లేదా ఇతర ఉద్యోగులను కానీ నియమించవచ్చు. అలా నియమించబడ్డవారు మంత్రుల బృంద స్థాయిలో పనిచేస్తారు.
ఈ ఆర్టికిల్ 356 ని కేంద్ర ప్రభుత్వం దురుపయోగం చెయ్యటానికి కూడా అవకాశం ఉంది. ప్రజలచేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులతో నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం తన రాజకీయ లబ్ధి కోసం రద్దు చెయ్యటానికి కూడా ఇది పనికి వస్తుంది. అందువలన సుప్రీం కోర్టులో ఈ విషయంలో వేసిన వివిధ పిటిషన్ల దృష్ట్యా సుప్రీం కోర్టు మార్గదర్శకాలను ఇస్తూ 1994లో చారిత్రాత్మక తీర్పునివ్వటం జరిగి 2000 నుంచి రాష్ట్రపతిపాలన విధించిన సందర్భాలు తక్కువైపోయాయి. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కోసం ఏర్పడ్డ సర్కారియా కమిషన్ కూడా రాష్ట్రపతి పాలనను విధించటానికి ఆర్టికిల్ 356 ని ఆచితూచి తప్పినిసరి పరిస్థితులలో వేరే మార్గం లేనప్పుడు మాత్రమే విధించాలని సూచించింది.
రాష్ట్రపతిపాలనంటే ఒక విధంగా ప్రభుత్వ యంత్రాంగం సుప్తచేతనంలో ఉన్నట్లే. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం అనేవి ఉండవు. ఉద్యమాలు, నిరసనలకు స్వస్తి పలకటం జరుగుతుంది కాబట్టి ప్రజలు కూడా ఆ సమయంలో తమ నిరసన చేసే హక్కుని పోగొట్టుకుంటారు. ప్రజాప్రతినిధులుండరు కాబట్టి తమ తరఫున ప్రాతినిధ్యం వహించేవారు ప్రాంతాలకు లేకుండా పోతారు.
అయితే రాష్ట్రంలో ఎన్నికలు యధావిధిగా జరగబోతున్నాయి కాబట్టి ఈ సారి రాష్ట్రంలో ఈ సంక్షోభం కేవలం జూన్ 2 వరకే. 1973లో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు సంవత్సరంపాటు రాష్ట్రం సుప్త చేతనావస్థలో ఉంది.
వివిధ రాష్ట్రాలలో ఇప్పటి వరకు 122 సార్లు రాష్ట్రపతి పాలన విధించగా మన రాష్ట్రంలో ఇది రెండవ సారి. అప్పుడు జై ఆంధ్ర ఉద్యమం వలన రాష్ట్రపతి పాలన వస్తే ఈసారి జైతెలంగాణా రాష్ట్రపతి పాలనను తీసుకునివచ్చింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more