ఎన్నికల నేపథ్యంలో దక్షిణ భారత దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ మీద కాంగ్రెస్ దృష్టి పెట్టినట్లుగానే భారతీయ జనతా పార్టీ కూడా కన్ను వేసింది.
ఉద్యమంతో తెలంగాణా ప్రాంతంలో బలం పుంజుకుని గట్టిగా జెండా పాతిన తెలంగాణా రాష్ట్ర సమితితో పోటీ చెయ్యలేక పరాజయం పాలవుతున్న సందర్భంలో ఆ పార్టీని దెబ్బతీయటం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణా మేమే ఇస్తామంటూ చెప్పుకుంటూ వచ్చింది. కానీ అందుకు సరైన సమయం కోసం వేచి చూడటంతోనే సమయమంతా గడిచిపోతోంది కానీ తెలంగాణా ఖ్యాతి ఎలాగైనా తెరాసాకే దక్కేట్టుగా కనిపించటంతో, ఉద్యమ పార్టీని తమ పార్టీలో కలుపుకుంటే అనే ఆలోచనకు తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ఇచ్చిన హామీ కూడా ఊతమిచ్చింది. మాకు అధికారాలు కాదు కావలసింది, తెలంగాణాయే ముఖ్యమంటూ చెప్పుకుంటూ రావటంతో కాంగ్రెస్ పార్టీ ఆఘమేఘాల మీద తెలంగాణా బిల్లును పార్లమెంటులో పాస్ చేయించుకోగలిగింది. అయితే అందుకు భాజపా సాయం పనికి వచ్చింది.
ఇక భాజపా సంగతి చూస్తే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణాలో తిరుగుతూ తెరాసకు ధీటుగా ప్రచారాలు చేస్తుండటం, కాంగ్రెస్ ఇవ్వకపోతే తెలంగాణాను మేమిస్తాం అని చెప్పటంతో కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి ఇంకా పెరిగింది నిజమే కానీ భాజపా కూడా తెలంగాణా వరకే పరిమితమైపోయింది. అంతేకాకుండా తెరాస కాంగ్రెస్ లో విలీనమయినట్లయితే రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది కదా అని ఆశించిన భాజపాకు తెరాస విలీనం కాకపోవటంతో మరింత ఇరకాటం ఏర్పడింది.
ఈ ప్రక్రియలో రెండు పార్టీలూ ముందుగానే సీమాంధ్రను పోగొట్టుకున్నాయి, ఆశించిన తెలంగాణా ప్రాతంలో చూస్తే తెరాస బలంగా వేళ్ళూనివుంది. అలా ఆంధ్రప్రదేశ్ లోని ఇరు ప్రాంతాలలోనూ కేంద్రంలోని అధికార విపక్ష పార్టీలు రెండూ రాజకీయంగా ఘోరంగా దెబ్బతిన్నట్లే కనిపిస్తున్నాయి.
అయితే విశ్వాస స్థాపనా కార్యక్రమంలో భాజపా నాయకులు ఒక పక్క మా వలనే తెలంగాణా వచ్చిందని చెప్తూనే సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరగకుండా చూస్తామని మాటిస్తున్నారు. కాంగ్రెస్ కూడా అదే పద్ధతిలో తెలంగాణా ఇచ్చింది మేమే నంటూ, సీమాంధ్ర ప్రజల వేదన తెలుసని వాళ్ళకి వరాల మూటలు చూపిస్తున్నారు. కానీ ఈ రెండు పార్టీల ప్రకటనల ప్రభావం ఇరు ప్రాంతాలలోనూ పడుతున్నట్లుగా కనిపించటంలేదు.
ఇది ప్రస్తుత పరిస్థితి. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కరలేదు!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more