ఈరోజుతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పికె మొహంతి పదవీకాలం అయిపోతోంది. అందువలన ముందుగానే పరిపాలన శాఖా అధికారులు ప్రధాన కార్యదర్శి అర్హతులున్నవారి జాబితాను 17 మందితో తయారు చేసారు. కానీ అప్పటికే రాజీనామా చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తాత్కాలిక నియమాలకు కూడా మొగ్గు చూపించలేదు. దానితో ఆ జాబితాను గవర్నర్ కి పంపించగా ఆయనకు అందులో అధికారాలు లేనందున ఆయనా పట్టించుకోలేదు.
ఈలోపులో ప్రధాన మంత్రి కలుగజేసుకుని ప్రధాన కార్యదర్శిని మార్చే ప్రయత్నం చెయ్యవద్దని, ఈ మూడు నెలలూ కొనసాగనివ్వమని అన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రధాన కార్యదర్శిని మారిస్తే గందరగోళం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే అలా ప్రధాన కార్యదర్శి పదవీ కాలాన్ని పొడిగించాలంటే గవర్నర్ కి రాష్ట్రపతి పాలనలోనే అధికారాలుంటాయి. అందువలన ఈరోజు రాష్ట్రపతి పాలనకు ప్రకటన జరగటంతో గవర్నర్ లాంఛన ప్రాయంగా ప్రధాన కార్యదర్శి పదవీకాలాన్ని పొడిగిస్తున్నట్లుగా ఆదేశాలిచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న పికె మొహంతి తర్వాత ఆ స్థానానికి అర్హులుగా ఐవైఆర్ కృష్ణారావు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఆయనను ఆ స్థానంలో కూర్చోబెడతారునుకున్నారు. మొహంతిని రాష్ట్రపతి తనకి సలహాదారుగా కూడా నియమించవచ్చు. అయితే మొహంతిని ప్రధాన కార్యదర్శి స్థానంలోనే కొనసాగించటం మంచిదన్న అభిప్రాయానికి నిన్న రాత్రే రావటం వలన ఈరోజు గవర్నర్ ఆదేశాలు కేవలం లాంఛనప్రాయమే అవుతాయి.
రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగమైన ఉద్యోగులు అధికారులను, ఆస్తులు అప్పులను విభజించే పనిని మొహంతి పర్యవేక్షిస్తున్నారు కాబట్టి ఆ పనిలో భగ్నం ఏర్పడకుండా సజావుగా పూర్తవటం కోసం మొహంతిని ఆ పదవిలోనే కొనసాగనివ్వాలని కేంద్ర ప్రభుత్వం భావించటమే దీనికి కారణం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more