Telangana triggers stir in bihar

Telangana triggers stir in Bihar, BJP calls for rail roko, Nitish Kumar calls for bandh, Telangana State formation, Special status to Seemandhra, Special status to Bihar demanded

Telangana triggers stir in Bihar, BJP calls for rail roko, Nitish Kumar calls for bandh

తెలంగాణా దెబ్బకి బీహార్ లో రైల్ రోకో

Posted: 02/28/2014 10:32 AM IST
Telangana triggers stir in bihar

ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీహార్ లో రైల్ రోకో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.  పాట్నా, నలంద, సహర్స ప్రాంతాల్లో భాజపా నాయకులు, కార్యకర్తలు బీహార్ లో రైల్ రోకోలో చురుగ్గా పాల్గొంటున్నారు.  ఈ  కార్యక్రమం భాజపా నిర్వహిస్తుండగా అదే పనిలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న జనతా దళ్ (యు) అధ్యక్షుడు, బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ మార్చి 2 న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునిచ్చారు. 

అయితే ఈ రెండు పార్టీలూ నిరసనను తెలియజేస్తున్నది ఒకే విషయం మీద.  అదేమిటంటే బీహార్ కి ప్రత్యేక ప్రతిపత్తి కోసం!  మా రాష్ట్రం కూడా ఆర్థికంగా వెనకబడివుందని, తేరుకోవటం కోసం ప్రత్యేక ప్రతిపత్తిని ప్రసాదించమని బీహార్ సంవత్సరాల తరబడి పోరాటం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లున్న కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చెయ్యటం కోసం సీమాంధ్రకు కొన్ని రోజుల్లోనే నిర్ణయం తీసుకుని ప్రత్యేక ప్రతిపత్తిని ప్రకటించారని, ఇది చాలా అన్యాయమని, బీహార్ ప్రజలకు తీరని అన్యాయం జరుగుతోందని నితిష్ కుమార్ అన్నారు. 

ఈరోజు రైల్ రోకో, మార్చి 2 న బంద్ అయిన తర్వాత మార్చి 5 న నితిష్ కుమార్ సంకల్ప యాత్రను చంపారన్ జిల్లా నుండి ప్రారంభించనున్నారు. 

జెడియు, భాజపాలు తమ ఆందోళనకు సహకరించమని ప్రజలను కోరాయి.  ఈరోజు రైలు యాత్రలను మానుకోమని భాజపా కోరితే, మార్చి 2 న పనులను బహిష్కరించమని నితిష్ కుమార్ బీహార్ ప్రజలను కోరారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles