ముంబైకి 80 కిలోమీటర్ల దూరంలో ఐఎన్ఎస్ సిందురత్న సబ్ మెరైన్ ప్రమాదానికి లోనైంది. ఏడుగురు నేవీ అధికారులకు గాయాలయ్యాయి, ఇద్దరి ఆచూకీ తెలియటం లేదు.
ఈ సబ్ మెరైన్ ఉపయోగయోగ్యమా కాదా అన్నది పరీక్షించటానికి తీసుకెళ్ళిన వెస్టర్న్ కమాండ్ ఆధ్వర్యంలో జరిగిన పరీక్షణలోనే ఘోరంగా విఫలమవటంతో పాటు నష్టానికి గురిచేసింది.
ఉదయం చేసిన ఈ పరీక్షణా యాత్రలో ముందుగా క్యాబిన్ లో ఒత్తైన పొగ కమ్మివేసిందని నేవీ అధికారి చెప్పారు. వెంటనే అత్యవసర అగ్నిమాపక చర్యలను చేపట్టామని, ఈ లోపులోనే పొగ పీల్చిన అధికారులను ఎయిర్ లిఫ్ట్ చేసి హాస్పిటల్ కి పంపించటం జరిగిందని ఆయన అన్నారు. మరో ఇద్దరు కనపడటం లేదని, వాళ్ళు అదే క్యాబిన్ లోనే ఉన్నారో లేకపోతే ఇంకా లోపల రహస్యంగా ఉన్న క్యాబిన్లలో దేనిలోనైనా ఉన్నారో తెలియలేదు అన్నారు నేవీ అధికారి.
ఐఎన్ఎస్ సింధురత్నకి ఈ మధ్యకాలంలోనే ముంబైలో మరమ్మత్తులు జరిగి యోగ్యతా పరీక్షలు జరిగాయి. అయితే సముద్రంలో చేసిన మొదటి పరీక్షలోనే ఇది విఫలమైంది.
ఈ సంఘటన జరిగిన సమయంలో అందులో 70 మంది వరకు నేవీ అధికారులున్నారు. సంఘటన జరగగానే సబ్ మెరైన్ ని పైకి తీసుకునివచ్చారు. గాయపడినవారిని నేవీ హాస్పిటల్ ఐఎన్ఎస్ అశ్వినికి చేర్చారు.
గత ఏడు నెలలలో జరిగిన జలాంతర్గామి ప్రమాదాలలో ఇది మూడవది. 2013 లో ఐఎన్ఎస్ సింధు రక్షక్ మునిగిపోగా 18 మంది నేవీ సిబ్బంది మరణించారు. జరిగిన నష్టం దృష్ట్యా చూస్తే దీని తర్వాత జరిగింది ఐఎన్ఎస్ బేట్వాకి. ఐఎన్ఎస్ కొంకణ్ కి విశాఖపట్నంలో నష్టం జరిగింది.
సింధురక్షక్ కి జరిగిన నష్టం తర్వాత హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సబ్ మెరైన్ వైఫల్యాల మీద సమగ్రంగా దర్యప్తు చేసి నివేదికలనివ్వమని కోరారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more