ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారని, కొత్త పార్టీ పెడతారని వస్తున్న వార్తల నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ తన మనసులోని మాటను బయటపెట్టారు. తాను మాత్రం కాంగ్రెస్ ని వీడి పోనని, కార్తకర్త నుంచి సిఎం వరకు తాను సేవచెయ్యదలచుకుంది కాంగ్రెస్ లోనేనని ఆయన అన్నారు.
బొత్సా సత్యనారాయణతో భేటీ అయిన మంత్రులు విభజన బిల్లుని ఆపటం కోసం ఆఖరు ప్రయత్నం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. బొత్సా నివాసంలో సోమవారం సాయంత్రం జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఆనం రామ నారాయణ, రఘువీరా రెడ్డి, కన్నా, కొండ్రు మురళి, బాలరాజు, మాణిక్య వరప్రసాద్, సి.రామచంద్రయ్య తదితరులు హాజరవగా సోమవారం ఉదయం బొత్సాతో వట్టి వసంత కుమార్, శైలజా నాథ్, పార్థసారధి, కాసు కృష్ణారెడ్డి భేటీ అయ్యారు.
ఈ సమావేశాలకు అజెండా కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడితే అందులో ఎవరు చేరతారని తెలుసుకోవటం. కిరణ్ కుమార్ రాజీనామా చెయ్యరని కొందరు చేస్తారని కొందరు, చేస్తే మాత్రం ప్రయోజనం ఏమిటని మరికొందరు అభిప్రాయపడ్డారు. రాజీనామా చెయ్యవలసిన సమయం ఇది కాదని, బిల్లు తయారవుతున్నప్పుడే మూకుమ్మడి రాజీనామాలు చేసుంటే పరిస్థితి మరోలా ఉండేదని బొత్సా అన్నారు.
భేటీ అయిన మంత్రులలో కొందరు ఉంటే కాంగ్రెస్ లో ఉంటాం లేకపోతే స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తామని తెలియజేసారు. కొందరు ఆలోచించి చెప్తామని, సమయం కావాలని, నియోజక వర్గంలో ప్రజల అభిప్రాయం తెలుసుకుని చెప్తామని అన్నారు.
బొత్సా మాత్రం తను సిఎం అవదలచుకున్నానన్న మాటను మాత్రం మర్మగర్భంగా కాంగ్రెస్ కి విశ్వాస పాత్రుడననే మాటల్లో చెప్పారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more