రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే ప్రగతి సాధ్యమని ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్యాత్మిక సంస్థను స్థాపించి ప్రపంచ విఖ్యాతి గాంచిన రవిశంకర్ గురూజీ ఒంగోలులో కళాశాల యువతను సంభోదిస్తూ దేశంలోని లంచగొండితనాన్ని రూపమాపటానికి యువత ముందడుగు వేయాలని, బాధ్యతాయుతంగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకుని, ఓటు హక్కుని వినియోగించుకుని ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుతూ ప్రస్తతం దేశంలో ఉన్న అవినీతిని తరిమికొట్టాలని అన్నారాయన.
ఇది యువతతోనే సాధ్యమని, అందుకు యువత ముందుకు వచ్చి దేశాన్ని ప్రగతిపథంలో నడిపించవలసిన అవసరం ఉందని అన్న రవిశంకర్ గురూజీ ఈ కాలంలో రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ తమ పార్టీ బాగోగులు ముందు చూసుకుని ఆ తర్వాత సమయం చిక్కితే ప్రజల సౌభాగ్యం గురించి ఆలోచిస్తున్నారని, ఆ ధోరణి మారి ముందు ప్రజలు ఆ తర్వాతనే రాజకీయ పార్టీ లబ్ధి కోసం చూసుకోవటం జరగాలని ఆయన అన్నారు.
ఒంగోలు రైల్వే స్టేషన్లో జరిగిన సభకు విచ్చేసిన రవిశంకర్ గురూజీకి జిల్లా ఎస్పి ప్రమోద్ కుమార్ స్వాగతం పలికారు. రవిశంకర్ గురూజీ భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీకి ఎన్నికల ప్రచారంలో మద్దతునిస్తున్నారు.
పుట్టపర్తి సత్య సాయి కూడా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకోసం ఉద్యమాలు జరుగుతున్న సమయంలో రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి చెందుతుందని చెప్పగా తెలంగాణా ఉద్యమం ఉధృతంగా ఉన్న ఆ సమయంలో ఆ మాటలు రుచించని తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ఆధ్యాత్మిక గురువులు బోధించటం వరకే పరిమితమవాలి కానీ రాజకీయాలలో జోక్యం చేసుకోగూడదని ఘాటుగా విమర్శించటం జరిగింది.
నరేంద్ర మోదీకి మద్దతునిస్తున్న రవిశంకర్ గురూజీ రాష్ట్ర విభజన జరగకూడదన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చటం పట్ల సీమాంధ్రలో హర్షం వ్యక్తం చేసారు. దీనితో భాజపా ఉద్దేశ్యం కూడా అదేనన్న అభిప్రాయం కూడా కలుగుతోంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more