చివరకు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి తలవొగ్గి సబ్సిడీలో కనెక్షన్ కి సంవత్సరానికి ప్రస్తుతం 9 వంట గ్యాస్ సిలెండర్లు ఇస్తున్న హద్దుని 12 కి పెంచింది. దానితో పాటుగా సబ్సిడీ సొమ్ముని ఆధార్ లింక్ తో గ్యాస్ వినియోగదారుని బ్యాంక్ ఖాతాలో నేరుగా జమకట్టే విధానాన్ని ప్రస్తుతానికి పక్కకు పెట్టేస్తోంది. అంటే రాయితీ మినహాయింపు సొమ్మునే చెల్లించే విధానాన్ని పూర్వకాలంలాగా తిరిగి తీసుకువస్తోంది. ఇక, మొత్తం సొమ్ము చెల్లించి ఖాతాలో రాయితీ సొమ్ముని తిరిగి పొందవలసిన అవసరం ఇప్పుడు ఉండదు.
దీనివలన ప్రభుత్వానికి అదనంగా రూ.5000 కోట్లు రాయితీ రూపంలో భారం పడబోతోందని చమురు శాఖా మంత్రి వీరప్ప మొయిలీ అన్నారు.
అయితే ఈ విధానం వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుంది. ఈ లోపులో ఫిబ్రవరి మార్చి నెలల్లో ప్రస్తుతం ఉన్న 9 గ్యాస్ సిలెండర్ల మీద అదనంగా మరో సిలెండరు కూడా వినియోగదారులు తీసుకోవచ్చునని కూడా మొయిలీ అన్నారు.
ఆధార్ కార్డ్ లింక్ తో వినియోగ దారుని ఖాతాలో నేరుగా జమకట్టే విధానాన్ని పక్కకు పెట్టటానికి కారణం, పథకాన్ని అమలుపరచటంలో కొన్ని సాధకబాధకాలు వినియోగదారుల అభియోగాల రూపంలో తమ దృష్టికి వచ్చాయని, వాటిని పరిశీలించే ఉద్దేశ్యంతో దాన్ని కొన్నాళ్ళు హోల్డ్ లో పెట్టటం జరిగిందని మొయిలీ అన్నారు.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వంట గ్యాస్ రాయితీలో ఇస్తున్న 9 సిలెండర్ల నుంచి సంవత్సరానికి 12 సిలెండర్లకు పెంచాలని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ని కోరారు. దాని ప్రభావమే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం. ఇంతకు ముందు కూడా ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ చిత్తు కాగితంతో సమానమని వ్యాఖ్యానించగా ప్రభుత్వం దాన్ని హడావిడిగా రద్దు చేసింది. అది నేరారోపణలో ఉన్న ప్రజాప్రతినిధుల మీద అనర్హులని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్.
పై రెండు సంఘటనల ద్వారా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి ఇచ్చే విలువ, ఆయన ప్రధానమంత్రి పదవికి చేరుకోవటానికి బాటలు వెయ్యటానికి చేస్తున్న కృషి అర్థమౌతున్నాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more