రాష్ట్ర పునర్విభజన బిల్లు మీద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలను చేసారు.
శాసన సభలో తన కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో సమావేశమైన కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రానికి పంపించిన ఈ బిల్లును దమ్ముంటే ఇలాగే పార్లమెంటులో ప్రవేశపెట్టమని, అలా చేసినట్లయితే, అందుకు పార్లమెంటు అనుమతించినట్లయితే తాను ముఖ్యమంత్రి పదవి నుంచే కాదు రాజకీయాల నుంచి కూడా వైదొలుగుతానని అన్నారు.
తన తరఫు నుంచి బిల్లు మీద ఆక్షేపణలను తెలియజేస్తూ తాను రాష్ట్రపతి నుంచి మూడువారాల గడువు అడిగింది కేవలం ఆ బిల్లులోని లోపలనన్నిటినీ ఎత్తి చూపటానికేనన్నారు కిరణ్ కుమార్. సభకు ఎలాంటి అధికారం లేదు, ఇది పార్లమెంటు చెయ్యవలసిన పనే అని అంటున్న వారు ఓటింగ్ కి ఎందుకు భయపెడుతున్నారు, అసలు ఇక్కడకు పంపకుండా నేరుగానే పార్లమెంటులో ప్రవేశపెట్టివుండవచ్చుగా అని ఆయన ప్రశ్నించారు.
తనకు రాష్ట్ర ప్రజలంతా సమానమేనని, తాను విభజనకు పూర్తిగా వ్యతిరేకమని అన్న కిరణ్ కుమార్ రెడ్డి ఏ ఉద్దేశ్యంతో విభజన బిల్లుని తయారు చేసారో చెప్పకుండా అభిప్రాయం చెప్పమంటే ఈ సభ దేనిమీద చెప్తుందంటూ ప్రశ్నించారు. అదీ గాక సభలో ఇంతవరకు 86 మందే మాట్లాడారు. ప్రజాప్రతినిధులంతా దీనిమీద అభిప్రాయం చెప్పకపోతే అది రాష్ట్ర ప్రజల అభిప్రాయమెలా అవుతుంది అన్నారాయన. సభ్యులు మొత్తం 9024 సవరణలు ప్రతిపాదించినప్పుడు దీని మీద చర్చ జరగకుండా ఎలా పంపిస్తాము అని అడిగారాయన.
మిగతా రాష్ట్రాలలోని విభజన ప్రక్రియ గురించి మాట్లాడుతూ ఆ రాష్ట్రాలలోని పరిస్థితికి మన రాష్ట్రంలో పరిస్థితికి చాలా తేడా ఉందని, అక్కడ జరిగినట్లుగా ఇక్కడ జరగటం వీలు కాని పనని ఆయన అన్నారు.
అడిగిన గడువు ఇస్తారో లేదో తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వం నిజంగా ఈ బిల్లుని యథాతథంగా పార్లమెంటులో ప్రవేశపెట్టమనండి చూద్దాం అంటూ సవాల్ విసిరారు ముఖ్యమంత్రి. పార్లమెంటు దీన్ని ఇదే స్థితిలో ఆమోదించదని, అలా ఆమోదించినట్లయితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కిరణ్ కుమార్ రెడ్డి ఆత్మ విశ్వాసంతో చెప్పారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more