అటవీ అధికారుల వివరణ ప్రకారం తమిళనాడులోని ఊటీకి దగ్గర్లో ఉన్న దొడ్డబెట్టా అరణ్యంలో మనుషులను, ఎన్నో పశువులను పొట్టబెట్టుకున్న పులి అటవీ దళం వారు తుపాకీతో కాల్చి చంపారు.
పులి కదలికలను కనిపెట్టటానికి అధికారులు సమీప గ్రామంలోను, టీ ఎస్టేట్ లోను 65 సిసి కేమెరాలను ఏర్పాటు చేసారు. దాదాపు 45 పాఠశాలలకు శలవులిచ్చి గ్రామవాసులు బిక్కుబిక్కుమంటూ ఇళ్ళకే పరిమితమైపోయారు. పులిని కాల్చి చంపటానికి కొద్ది సేపటి క్రితమే అది ఒక గేదెను భక్షించింది.
కలెక్టర్, అటవీ సిబ్బంది మానవ సంహారి పులి ని మట్టుపెట్టటానికి అడవి లోపలికి వెళ్ళారని చెప్పిన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అధికారి ఆ పులిని తుపాకీతో కాల్చి చంపారే కానీ దానికి మత్తు మందు ప్రయోగించే పని చెయ్యలేదని అన్నారు.
ఒక శతాబ్దం ముందు లక్ష పులులున్న భారత దేశపు అడవులలో, అటవీ శాఖవారి పులుల లెక్క ప్రకారం దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పులుల సంఖ్య 1700. వాటిలో కొన్ని ఒక్క నెల రోజుల కాలంలో 17 మంది మనుషులను చంపితిన్నాయి.
పులివాతతో వేదనకు గురైన గ్రామవాసులు అటవీ శాఖవారిమీద ఒత్తిడి తీసుకునివచ్చారు. మీరు అడ్డుకుంటారా లేక మేమే మా చేతుల్లోకి తీసుకోవాలా అని ప్రశ్నించారు.
పులికి వారానికో పెద్ద వేట అవసరం పడుతుంది. అంటే సంవత్సరానికి ప్రస్తుతమున్న పులుల లెక్క ప్రకారం 85000 సార్లు వేటాడుతాయి. అందులో సంవత్సరానికి 85 మంది మనుషులు వాటి బారిన పడి చనిపోవటమో లేక గాయపడటమో జరుగుతోంది. అయితే పులులు వలన కాకుండా పాము కాటు, లేక కుక్క కాటు వలన చనిపోతున్నవారి సంఖ్యలో ఇది చాలా చిన్నది కదా అందుకోసం పులుల మీద పగబట్టి వధించటం తగునా అని కొందరి ప్రశ్న.
ఒకవేళ మానవాహారానికి అలవాటుపడి మానవ సంహారానికి పూనుకున్నట్లయితే అటువంటి పులులను పట్టి బంధించాలి కానీ వధించటం సరైనది కాదని విజ్ఞులు, అరణ్య జంతుజాలాన్ని సంరక్షించేవారి వాదన. అయితే మనుషులను చంపటం మొదలుపెట్టిన వెంటనే తగిన చర్య తీసుకోవల్సి వుంటుంది. లేకపోతే గ్రామవాసుల ఆవేశాలు హద్దుమీరుతాయి. అంతేకాదు, జంతుజాలాన్ని రక్షించాలనుకునే ప్రణాళికలకు పౌరుల మద్దతు తగ్గిపోతుందని కొందరు అంటున్నారు.
కానీ విస్తృత అధికారాలతో ముందు పులిని వేటాడి చంపి అది మనుషులను భుజించటం మరిగిందని అనటానికి కూడా అవకాశం ఉంది.
మానవ సంహారి పులుల విషయం ఇక్కడ పరిగణనలోకి తీసుకోవలసింది మరో విషయం కూడా ఉంది. మనుషులకోసం దారి కాచి వేటాడుతోందా లేకపోతే అనుకోకుండా ఎదురుపడ్డప్పుడు తన ప్రాణ రక్షణకోసం చంపవలసివచ్చిందా అన్నది చాలా ముఖ్యం. ఆ పులి మానవ సంహారా కాదా అన్నది ముందు సరిగ్గా నిర్ణయించి ఆ తర్వాత దాని మీద తగు చర్య తీసుకోవలసి ఉంటుందని ఫీల్డ్ బయోలజిస్ట్ లు అంటున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more