కలియుగ దైవం అయిన తిరుమల తిరుపతి దేవస్థానం కొండను పవిత్రంగా ఉంచి, సామాన్య భక్తులకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా చూడాల్సిన టీడీడీ పాలక మండలి ఛైర్మెన్, అధికారులు సామన్య భక్తులను గాలికి వదిలేసి, వీఐపీలకు, కరుడుగట్టిన ఉగ్రవాదులకు, మాఫియా గ్యాంగ్ కి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తున్నారని టీడీపీ నేత గాలి ముద్దు ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించిన విషయం తెలిసిందే.
ఇటీవలి కాలంలో దర్శనం విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సామన్య భక్తులు అధికారుల పై ఎదురు తిరిగినందుకు భక్తుల పైనే కేసులు బనాయించిన టీటీడీ బోర్డు ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు కనుమూరి బాపిరాజు. భక్తుల పై కేసులు ఉపసంహరించుకుంటున్నామని, తిరుమల కొండకు వచ్చే భక్తులు ధర్మాన్ని పాటించాలని బాపిరాజు కోరారు. దర్శన విషయంలో సామాన్య భక్తులకు కలిగిన అసౌర్యానికి చింతిస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూసుకుంటామని మీడియా సమావేశంలో తెలిపారు.
ఇక గాలి ముద్దు ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించిన వ్యాఖ్యల పై స్పందిస్తూ... మాఫియా డాన్ దావూద్ అనుచరులకు దర్శనం కల్పించిన మాట వాస్తవమేనని, అయితే వారు దావూద్ అనుచరులను తమకు తెలియదని, మహరాష్ట్ర మంత్రితో వచ్చారు కాబట్టి వారికి ప్రోటోకాల్ ప్రకారం దర్శనం కల్పించామన్నారు. ఈయన మాటలను బట్టి చూస్తుంటే మహారాష్ట్ర మంత్రికి దావూద్ గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నాయా ? ఈ గ్యాంగ్ ఆ మంత్రి వెంట వస్తే సకల సపర్యలు చేయడం ఏంటి ? ఈ విషయం ఇప్పుడు మరింత రాజుకునే అవకాశం ఉంది. ఏమైనా కనుమూరి నిజం ఒప్పుకున్నాడని సామాన్య భక్తులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more