రేపు శుక్రవారం శాసనసభలో రాష్ట్ర పురనర్విభజీకరణ బిల్లు మీద చర్చకు వస్తుండటం, అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభా వ్యవహారాల మంత్రిత్వ పదవిని తెలంగాణా మంత్రి శ్రీధరబాబు నుంచి తప్పించి పక్కా సమైక్యాంధ్ర మంత్రైన శైలజానాధ్ కి అప్పగించటం మీద వెల్లువెత్తిన నిరసనల దృష్ట్యా, అఖిలభారత కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రామచంద్ర కుంతియా హైద్రాబాద్ విచ్చేయటం సర్వత్రా ఉత్కంఠను కలుగుజేస్తోంది.
రేపు శాసనసభలో సన్నివేశం ఎలావుంటుందన్నదానిమీద వివిధ రకాలుగా ఊహాగానాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణా బిల్లు మీద పీటముడి పడకుండా ఉండటం కోసం, బిల్లు సజావుగా ఉభయ సభలలోనూ పాస్ అవటం కోసం అధికారికంగా రాష్ట్రానికి వచ్చిన రామచంద్ర కుంతియా ఏం చేస్తారన్నది కూడా ఆసక్తికరంగా రాజకీయ రంగంలో అందరూ ఎదురు చూస్తున్నారు.
వస్తూనే కుంతియా చెప్పిన విషయం మంత్రిత్వ శాఖలను పర్యవేక్షించే మంత్రులను బదిలీ చేసే అధికారం రాష్ట్ర ముఖ్యమంత్రికే ఉందని.
రాష్ట్రానికి కొత్తగా వచ్చేవారికో ప్రత్యేకతుంటుంది. చెప్పదలచుకున్నవాటిని చెప్పటం, చెప్పదలచుకోనివాటిని తెలియనట్టుగా మరోసారి అడగటం చెయ్యవచ్చు. కొత్తవారు కాబట్టి విషయాలను తెలియజెప్పాలనే ఉద్దేశ్యంతో అందరూ పోటీలు పడి మరీ కథనాలను వినిపిస్తుంటారు. అందులో తమకు అనుకూలంగా ఉన్నవాటిని తీసుకోవచ్చు. అంతే కాకుండా చెప్పీ చెప్పీ మళ్లీ మళ్ళీ మాటలు మార్చి మార్చి చివరకు ఆ పని చెయ్యలేని స్థితికి వచ్చినప్పుడు కొత్త ముఖాన్ని పంపించటం జరుగుతుంటుంది. అందువలన ఒకసారి ఆజాద్ అయితే మరోసారి దిగ్విజయ్, తర్వాత అహ్మద్ పటేల్, మరోసారి చిదంబరం, ఆంటోనీ ఇలా మార్చి మార్చి ప్రతినిధులను పంపించటం జరుగుతుంది.
కేంద్రం నుంచి ఎవరు వచ్చినా ఆదేశాలు వచ్చేవి ఒక దగ్గరినుంచే అని అందరికీ తెలుసు. అయినా ఏదో ఎవరి ఆత్రుత వారిది. సర్ సర్ అంటూ కొత్తగా ఢిల్లీ నుంచి వచ్చేవాళ్ళకి హారతులు పట్టటం రాష్ట్ర నాయకులకు అలవాటే.
రేపు ఏం జరుగుతుంది, ఈ లోపులో కుంతియా ఏ వ్యూహాన్ని పన్నుతారన్నది చూడాలి!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more