దేశ రాజకీయాల్లో సంచలనం రేపి, ఢిల్లీలో గద్దెనెక్కనున్న ’ఆప్ ఆద్మీ పార్టీ ’ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కానీ, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతిని అధికారంలోకి రాగానే బయటపెడతామని, అవినీతి పరులైన కాంగ్రెస్ నాయకులకు వదిలిపెట్టేది లేదని పార్టీ స్పష్టం చేసింది.
ఆరోపణలు ఉన్న అందరి నాయకులపైనా, అధికారుల పైనా విచారణ చేయిస్తామని, కాంగ్రెస్ కేవలం బయటి నుంచి తమ ప్రభుత్వానికి మద్దతు ఇస్తోందని, అంతమాత్రాన ఆ పార్టీలో ఉన్న అవినీతిపరులైన నాయకులను వదిలిపెట్టాల్సిన అవసరం లేదని అంటున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి రాసిన లేఖలో అరవింద్ కేజ్రీవాల్ కామన్వెల్త్ క్రీడల గురించి ప్రస్తావించారు. మేం అధికారంలోకి వస్తే వీటిపైనే ముందుగా విచారణ చేయిస్తాం. ఒకవేళ దానివల్ల ప్రభుత్వం పడిపోయినా.. మాకేమీ నష్టం లేదు అని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు యోగేంద్ర యాదవ్ తెలిపారు.
ఓ వైపు ఆపార్టీ మద్దుతుతో ఢిల్లీ గద్దెనెక్కుతోనే ఆ పార్టీతో సంబంధం, పొత్తు లేవని చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని అక్కడి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీని పై ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి. మరోవైపు ఢిల్లీ పోలీసులు కల్పించనున్న జడ్ కేటగిరీ సెక్యూరిటీని కాబోయే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిరాకరించారు. తనకు ఎలాంటి ప్రత్యేక పోలీసుల భద్రత అవసరం లేదని, ఆ దేవుడే రక్షగా ఉంటాడని పేర్కొంటూ, తనకు కల్పించిన జడ్ కేటగిరీ భద్రతను వెనక్కి తిప్పి పంపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more