టాలీవుడ్ ఇండస్ట్రీ మరో హాస్య నటుడ్ని కోల్పోయింది. ఇటీవలే ఏవీఎస్ మరణం మరచిపోక ముందే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ‘ఆనందో బ్రహ్మా ’ అంటూ చెరగని ముద్రవేసిన ‘ధర్మవరపు సుబ్రహ్మణ్యం ’ కేన్సర్ వ్యాధితో బాధ పడుతూ హఠాన్మరణం చెందారు. గత రెండు దశాబ్దాలకు పైగా తెలుగు ప్రేక్షకులన్ని అలరిస్తూ, శాశ్వత స్థానం సంపాదించుకున్న ధర్మవరపు (53) హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ లోని ఆయన స్వగ్రుహంలో శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు.
ధర్మవరపుది ప్రకాశం జిల్లాలోని కొమ్మినేనివారి పాలెం స్వగ్రామం. గత ఏడాదిగా ఆయన లంగ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన పార్థీవదేహాన్ని నేడు సందర్శనార్థం ఉంచి , తరువాత ప్రకాశం జిల్లాలోని సింగరకొండలో ఉన్న ఫామ్ హౌజ్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జంధ్యాల సినిమా ‘జయమ్ము నిశ్చయమ్మురా ’తో వెండితెర పరిచయం అయిన ధర్మవరపు జంధ్యాల బలవంతం మేరకు (1989) రంగనాథం పాత్ర చేశారు.
తరువాత చిన్న చిన్నగా ఎదుగుతూ...ధర్మవరపు తన కెరీర్లో ఎంతో ఎత్తుకు ఎదిగాడు. అవకాశాల కోసం ఎన్నడూ వెనుతిరిగి చూడాల్సిన అవసరం కూడా రాలేదు. తోటి హాస్యనటులకు దీటుగా తనదైన మార్కు హాస్యంతో పరిశ్రమలో నిలబడ్డారు. ఎక్కడా అతి లేకుండా, పరిధులు దాటకుండా, అశ్లీలతకు దూరంగానే హాస్యాన్ని పండించారు. వాచకంలో స్పష్టత, తెలుగుదనం ఉట్టిపడడం ఆయనలోని ప్రత్యేకత.
ఆయన డైలాగ్ మాడ్యులేషన్, ఆయనకంటూ ఓ శైలిని సృష్టించిపెట్టింది. వెండితెరనే కాకుండా, బుల్లి తెర పై కూడా అలరించిన ఆనందో బ్రహ్మా అకాల మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటుగా చెప్పవచ్చు. ఈయన మరణం పట్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more