అరవింద్ కేజ్రీవాల్ అంటే పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు, గానీ, అన్నా హజారే ఉద్యమంలో హల్ చల్ చేసిన కేజ్రీవాల్ అంటే మాత్రం అందరికి తెలిసిందే. అన్నా హజారే నుండి విడిపోయి, సొంత రాజకీయ పార్టీ పెట్టుకున్న అరవింద్ కేజ్రీవాల్ ను అన్నా హజారే అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిన అరవింద్ కేజ్రీవాల్ పై అన్నా హజారే అభిమాని నల్ల రంగుతో దాడి చేయటం జరిగింది. కేజ్రీవాల్ పార్టీ నేతలతో కలసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ఆకస్మిక పరిణామం చోటు చేసుకుంది. కేజ్రీవాల్ సమావేశ వేదిక వద్దకు వస్తుండగా, ‘అన్నా హజారే జిందాబాద్’ అని నినాదాలు చేస్తూ దూసుకొచ్చిన వ్యక్తి అకస్మాత్తుగా ఆయనపై ఒక డబ్బాతో నల్లరంగు చల్లడంతో కలకలం రేగింది.
ఈ ఘటనలో కేజ్రీవాల్ ముఖంపై కొంత రంగు పడింది. ఆయన పక్కనే ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీష్ సిసోడియా, ప్రశాంత్ భూషణ్, సంజయ్ సింగ్లపైనా రంగు పడింది. తాను బీజేపీ అహ్మద్నగర్ శాఖ ప్రధాన కార్యదర్శి నచికేత వాఘ్రేకర్గా చెప్పుకున్న ఆ వ్యక్తి రంగు చల్లడంతో పాటు కేజ్రీవాల్పై ఆరోపణలు గుప్పించడంతో పార్టీ కార్యకర్తలు అతడిని బలవంతంగా బయటకు తీసుకుపోయారు. కేజ్రీవాల్ తన గురువైన హజారేతో పాటు ప్రజలకు కూడా ద్రోహం చేస్తున్నారని వాఘ్రేకర్ ఆరోపించాడు.
కేజ్రీవాల్ స్పందిస్తూ, తమ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణకు ఓర్వలేని వారే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. నిస్పృహతోనే బీజేపీ ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ ఆరోపించారు. మరోవైపు, తమ పార్టీ కార్యకర్త నల్లరంగు చల్లినట్లు కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారని, అయితే, ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా తాము ఆమోదించబోమని బీజేపీ నేత వీకే మల్హోత్రా అన్నారు. అయితే కేజ్రీవాల్ మాత్రం మరకమంచిదే అని ముందుకు సాగిపోతున్నాడు. ఈ ఘటన పై అన్నా హజరే కు లేఖ రాసినట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more