సమైక్యాంద్ర కోసం మేము పోరాటం చేస్తున్నాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మేము అధిష్టాన్నికోరాం అని సీమాంద్ర నాయకులు జూలై 31 తేది నుండి చెబుతున్నారు. సీమాంద్ర నాయకులు మీడియా ముందు ఎంత నాటకం ఆడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా రాష్ట్ర విభజన పై అంతే దూకుడుగా ముందుకు పోతుంది. అయితే ఈరోజు సీమాంద్ర ప్రాంతానికి చెందిన కొంత మంది మంత్రులు మళ్లీ మీడియా ముందుకు రావటం జరిగింది. వీరు సమైక్యాంద్ర కోసం అధిష్టానతో ఫైట్ చేస్తున్నట్లు మీడియా ముందు నటిస్తున్నారు.
కావూరి సాంబశివరావు, చిరంజీవి, జేడీ శీలం, పనబాక లక్ష్మీ, పురందేశ్వరి, పళ్లంరాజు కిల్లి క్రుపారాణి ఈరోజు జీవోఎంతో సమావేశమయ్యారు. అనంతరం జేడీ శీలం ముందుగా మీడియాతో జీవోఎం సమావేశంలో మాట్లాడిన అంశాలను చెప్పటం జరిగింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జీవోఎంను కోరినట్లు చెప్పారు. విభజన వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించామని, జీవోఎం తమ సమస్యలను పరిస్కరిస్తుందన్న నమ్మకం కలిగిందన్నారు. హైదరాబాద్ నగరంలో మూడో వంతు సీమాంద్ర ప్రజలు ఉన్నారని, సమస్యలు పరిష్కరించిన తర్వాతే ముందుకెళ్లాలని సూచించినట్లు చెప్పారు.
కేంద్రం ప్రభుత్వం సంస్థల ఏర్పాటుతో హైదరాబాద్ చుట్టూ అనేక అనుబంధ సంస్థలు ఏర్పాడ్డాయని , హైదరాబాద్ అందరిదీ అని జేడీ శీలం అన్నారు. ఈ సందర్భంగా సీమాంద్ర కేంద్ర మంత్రుల కమిటీ ఏడు పేజీల నివేదికను జీవోఎంకు అందజేసింది. విభజన అనివార్యమైతే.. హెచ్ ఎండీ ఏ ప్రాంతాన్ని ఢిల్లీ తరహా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని శీలం కోరారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుంటే 5 రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ మొట్టమొదటి డిమాండని ఆయన స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more