Seemandhra leaders on samaikya raagam

seemandhra leaders on samaikya raagam, Samaikyandhra Raagam, seemandhra leaders, congress party, seemandhra central ministers, congress high commend, GOM meeting, telangana issue, ap bifurcation,

seemandhra leaders on samaikya raagam

మళ్లీ మళ్లీ అదే చెబుతున్నారు?

Posted: 11/18/2013 03:08 PM IST
Seemandhra leaders on samaikya raagam

సమైక్యాంద్ర కోసం మేము పోరాటం చేస్తున్నాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మేము అధిష్టాన్నికోరాం అని సీమాంద్ర నాయకులు జూలై 31 తేది నుండి చెబుతున్నారు. సీమాంద్ర నాయకులు మీడియా ముందు ఎంత నాటకం ఆడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా రాష్ట్ర విభజన పై అంతే దూకుడుగా ముందుకు పోతుంది. అయితే ఈరోజు సీమాంద్ర ప్రాంతానికి చెందిన కొంత మంది మంత్రులు మళ్లీ మీడియా ముందుకు రావటం జరిగింది. వీరు సమైక్యాంద్ర కోసం అధిష్టానతో ఫైట్ చేస్తున్నట్లు మీడియా ముందు నటిస్తున్నారు.

 

కావూరి సాంబశివరావు, చిరంజీవి, జేడీ శీలం, పనబాక లక్ష్మీ, పురందేశ్వరి, పళ్లంరాజు కిల్లి క్రుపారాణి ఈరోజు జీవోఎంతో సమావేశమయ్యారు. అనంతరం జేడీ శీలం ముందుగా మీడియాతో జీవోఎం సమావేశంలో మాట్లాడిన అంశాలను చెప్పటం జరిగింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని జీవోఎంను కోరినట్లు చెప్పారు. విభజన వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించామని, జీవోఎం తమ సమస్యలను పరిస్కరిస్తుందన్న నమ్మకం కలిగిందన్నారు. హైదరాబాద్ నగరంలో మూడో వంతు సీమాంద్ర ప్రజలు ఉన్నారని, సమస్యలు పరిష్కరించిన తర్వాతే ముందుకెళ్లాలని సూచించినట్లు చెప్పారు.

 

కేంద్రం ప్రభుత్వం సంస్థల ఏర్పాటుతో హైదరాబాద్ చుట్టూ అనేక అనుబంధ సంస్థలు ఏర్పాడ్డాయని , హైదరాబాద్ అందరిదీ అని జేడీ శీలం అన్నారు. ఈ సందర్భంగా సీమాంద్ర కేంద్ర మంత్రుల కమిటీ ఏడు పేజీల నివేదికను జీవోఎంకు అందజేసింది. విభజన అనివార్యమైతే.. హెచ్ ఎండీ ఏ ప్రాంతాన్ని ఢిల్లీ తరహా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని శీలం కోరారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుంటే 5 రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ మొట్టమొదటి డిమాండని ఆయన స్పష్టం చేశారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles