సమైక్యాంధ్ర కోసం ఏపీ ఎన్జీఓలందర్ని ఒకే తాటి పైకి తెచ్చి, ఉద్యమాన్ని నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు అశోక్బాబు త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నాడా ? అంటే ఆయన మాటల్ని బట్టి అవుననే అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఉద్యమంలోకి రాజకీయ పార్టీల్ని రానివ్వం.... రాజకీయ నాయకులతో, పార్టీలతో సబంధం లేకుండా ఉద్యమాన్ని నడిపిస్తామంటున్న అశోక్ బాబు మనస్సు రాజకీయాల వైపు మళ్లినట్లుంది. అందుకే ఆయన సూత్రపాయంగా రాజకీయాల్లోకి రావాల్సివస్తుందేమోనని అన్నారు.
నిన్న రాత్రి కృష్ణాజిల్లా గుడివాడలో జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పార్టీలు, అవకాశవాద నాయకులను చూస్తుంటే రాజకీయాల్లోకి రావాలన్న ప్రజల సూచనను మన్నించాల్సి వస్తుందేమోనని పేర్కొన్నారు. తాము ఉద్యోగాల్లో ఉంటూ ఉద్యమాలు చేస్తున్నది జీతాల కోసం కాదని, భవిషత్తులో మా బిడ్డల జీవితాల కోసం చేస్తున్నామని, రాజకీయ నాయకుల చేతకాని తనం వల్లే రాష్ట్ర విభజన జరిగిందని అన్న ఆయన ప్రజల కోసం, మా బిడ్డల జీవితాల కోసం ఉద్యోగులు ఉద్యమం బాట పట్టాల్సి వచ్చిందని, ఉద్యోగులంతా ఏకమై 2014 వరకు తెలంగాణ రాష్ట్ర విభజనను అడ్డుకోగలమని అన్నారు.
ఈసారి జరిగే పీపుల్స్ రివల్యూషన్ (ప్రజల తిరుగుబాటు) ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తుందని, రాజకీయ పార్టీల చరిత్రనే మార్చేస్తుందని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ కి పెద్ద దిక్కుగా ఉన్న హైదరాబాద్ ను తెలంగాణలో కలిపేస్తే... ఢిల్లీని యూపీలో కలుపుతారా అని ప్రశ్నించారు.
ఉద్యోగుల అండతో, ప్రజల సహాకారంతో ఉద్యమాన్ని నడుపుతున్న అశోక్ బాబు రాజకీయాల్లోకి వస్తే.... ఇప్పుడు చేతకాని రాజకీయ నాయకులు అని మాట్లాడుతున్న ఆయన అప్పుడు ఈయన కూడా ఓ చేతకాని నాయకుడిగా మిగిలిపోతాడనటంలో సందేహం లేదు. గతంలో టీఎన్ న్జీఓ అధ్యక్షుడు స్వామి గౌడ్ పరిస్థితి ఏమయ్యిందో గుర్తుకుతెచ్చుకుంటే మంచిది. ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే సొంత పార్టీ పెడతారా ? ఇప్పుడు ఈయన వెనక ఉండి ఉద్యమాన్ని నడిపిస్తున్న కిరణ్ పెట్టబోయే పార్టీలో చేరుతారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more