Kodandaram compares seemandhra people with britishers

Kodandaram compares Seemandhra people with Britishers, chandrababu naidu,kodandaram,Seemandhra leaders,samaikyandhra movement, Britishers

Kodandaram compares Seemandhra people with Britishers, chandrababu naidu,kodandaram,Seemandhra leaders,samaikyandhra movement, Britishers

వాళ్ళు వెళ్లమంటే వెళ్ళారు... వీళ్ళు మాత్రం...

Posted: 09/24/2013 08:35 AM IST
Kodandaram compares seemandhra people with britishers

తెలంగాణ జేఏసీ ఛైర్మెన్ కోదండరామ్ ఖమ్మం జిల్లా బోనకల్ లో జయశంకర్ విగ్రహావిష్కణలో పాల్గొన్న అనంతరం విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... సీమాంధ్రులను ఆంగ్లేయులతో పోల్చారు. 200 సంవత్సరాలు మన దేశాన్ని పాలించిన ఆంగ్లేయులు తిరుగుబాటు చేసి వెళ్లి పొమ్మంటే వెళ్ళారు కానీ... గత 60 సంవత్సరాల నుండి తెలంగాణ వారు తమ హక్కుల కోసం, తమ ప్రాంత అభివ్రుద్ధి కోసం పోరాటం చేస్తుంటే వీళ్ళు మాత్రం వెళ్లడం లేదని, హైదరాబాద్ ఎవడబ్బ సొత్తుకాదు. ముమ్మాటికీ తెలంగాణ సొత్తు.. అని ఆయన అన్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణరాష్ర్టం ఏర్పడినపుడే తెలంగాణ సంక్షేమం సాధ్యమవుతుంది. వనరులను దోచుకొని తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మార్చారని అన్నారు. తెలంగాణ ప్రక్రియ ఇంత దూరం వచ్చాక రాజకీయ పార్టీలు మళ్ళీ రాద్దాంతం చేస్తున్నాయని, ఒకప్పుడు అన్ని పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశాయని, ఇచ్చిన మాటపై కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. ఇంతదాకా వచ్చిన తరువాత రాష్ట్ర ఏర్పాటు జాప్యం చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయని, హైదరాబాద్ ను యూటీ అంటే ఒప్పుకునేది లేదని, సరిహద్దులతో కూడిన 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన డిమాండ్లు బాగానే ఉన్నా, ఒక ప్రొఫెసర్ అయిఉండి సీమాంధ్రులను ఆంగ్లేయులతో పోల్చడం సరికాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles