ఈరోజు హైద్రాబాద్ లో మంత్రుల నివాస ప్రాంగణంలో ఉదయం సమావేశమైన 14 మంది సీమాంధ్ర మంత్రులు, 23 మంది శాసన సభ్యులు, 10 మంది ఎమ్మెల్సీలు సీమాంధ్రలో చెలరేగుతున్న ఉద్యమ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకున్నారు.
మూకుమ్మడిగా రాజీనామాలు చెయ్యాలని నిర్ణయించుకున్నట్లుగా టిజి వెంకటేష్ తెలియజేసారు. ఉత్తుత్తి రాజీనామాలు కావని చెప్పటం కోసం అవి స్పీకర్ కి అందించవలసిన రాజీనామాల నమూనా ప్రతిలోనే ఉంటాయని కూడా స్పష్టం చేసారు.
మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, తమ తమ జిల్లాలకు పోయి సమైక్యాంధ్ర కార్యాచరణ సమితి నాయకులను రాష్ట్రం పట్ల కేంద్రంలో జరిగిన పొరపాటు విషయంలో సంప్రదించి, సిడబ్లుసి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేట్లుగా ఒత్తిడి తీసుకునివస్తామని వాళ్ళకి చెప్తామని అన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలలో విగ్రహాలను ధ్వంసం చెయ్యటాన్ని ఆయన ఖండించారు.
లోగడ కూడా రాజధానిని త్యాగం చేసిన ఆంధ్రులు మరోసారి హైద్రాబాద్ ని వదులుకోవటానికి సిద్ధంగా లేరని అన్న కాటసాని, తెలంగాణాకేమో ఏకంగా రాష్ట్రాన్నిచ్చారు, కోస్తాంధ్ర కేమో పోలవరాన్ని వరంగా ఇచ్చారు మరి మా సీమాంధ్ర మాటేమిటి అని ప్రశ్నించారు.
శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ తక్షణ రాజీనామాలే తాము తీసుకోబోతున్న చర్య అని చెప్పారు. సమైక్యరాష్ట్రం కోసం పదవులను త్యాగం చెయ్యటానికి నిర్ణయించుకున్నామని మంత్రి శైలజానాథ్ తెలియజేసారు. రాష్ట్రాన్ని సమైక్యం ఉంచటమే ధ్యేయంగా సమావేశంలో పాల్గొన్న మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు నిర్ణయం చేసుకున్నారని ఆయన వెల్లడించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more