ప్రక్రుతి మనుషుల పై పగబట్టినట్లు ఉంది. దాని కోపానికి చైనా అతలాకుతలం అయింది. ఇప్పటికే చైనాలో వరదల కారణంగా చాలా అవస్థలు పుడుతూ అల్లడుతున్న జనానికి పుండుమీద కారం చల్లినట్లు... నేడు భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో జింజియాన్, మిన్సియన్ రాష్ట్రాలను భూకంపం కుదిపేసింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు పై 6.6 గా నమోదు అయింది. ఈ భూకంపానికి మనకందిన సమాచారం ప్రకారం 47 మంది చనిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో మూడు వందల మందికి పైగా గాయపడ్డారు. భూకంప కేంద్రం బైడావో నగరానికి 151 కిలోమీటర్ల దూరంలో భూమికి కేవలం 9.8 కిలోమీటర్ల లోతున ఉంది. రెండు గంటల తర్వాత.. అంటే ఉదయం ఏడు గంటల ప్రాంతంలో 5.6 తీవ్రతతో మరో భూకంపం కూడా వచ్చింది. 5,600 ఇళ్లలోని దాదాపు 21 వేల గదులు ధ్వంసమయ్యాయి. జాంజియాన్ రాష్ట్రంలో 1,203 గదులు కూలిపోయినట్లు సమాచారం. కేబుళ్లు తెగిపోవడంతో టెలికమ్యూనికేషన్ లేకుండా పోయింది. ఈ భూకంప ప్రభావం చాలా టౌన్షిప్లపై ఉండటంతో ఇళ్ళు చాలా వరకు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఇళ్లతో పాటు భారీ వృక్షాలు కూడా ఊగుతూ కనిపించాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడానికి పోలీసులు, సైనికులతో పాటు స్థానిక మిలీషియా సిబ్బందిని కూడా పంపారు. చైనా రెడ్క్రాస్ సొసైటీ కూడా సహాయ సామగ్రితో సిబ్బందిని పంపింది. రైల్వే వంతెనలు, టెలికం టవర్లను త్వరగా పునరుద్ధరించడానికి యుద్ధప్రాతిపదికన పనులు మొదలయ్యాయి . మరికొన్ని గంటలు ఆగితే గానీ పూర్తి సమాచారం తెలిసే పరిస్థితి కనిపిస్తుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాల్సిగా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ఈ భూకంపంతో ఆ రెండు రాష్ట్రాల ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more