Peddireddy ramachandra reddy comment on img land

peddireddy ramachandra reddy, ycp leader peddireddy ramachandra reddy, img land, congress party, tdp, chandra babu naidu, ys rajasekar reddy, ys jagan, jagan-ysr,

peddireddy ramachandra reddy comment on img land

మేము అధికారంలో వస్తే ఆ భూమిపై విచారణ జరిపిస్తాం?

Posted: 06/22/2013 07:04 PM IST
Peddireddy ramachandra reddy comment on img land

ఆలూ లేదు సూలు లేదు కొడుకు పేరు అవినీతి లింగం అన్నట్లు గా వైసీపీ నాయకుల పరిస్థితి. మేము అధికారంలోకి వస్తే మీకు ఏం కావాలో అవి తీరుస్తాం, అని చెప్పే నాయకులను మనం చూసే ఉంటాం. కానీ మేము అధికారంలోకి వస్తే అవినీతి పై విచారణం  జరిపిస్తాం, అక్రమ జీవోలతో భూమిని సొంతం చేసుకున్న వారి పై విచారణ  జరిపిస్తాం  అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఐఎమ్.జి భూమి వ్యవహారంలో  అధికారంలో ఉన్న  ప్రభుత్వం విచారణకు చర్యలు తీసుకోకపోతే,  తాము అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తామని  మాజీ మంత్రి, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్  పార్టీ  నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఐఎంజీ భూ వ్యవహారంలో ముమ్మాటికీ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆయన అన్నారు. విచారణ జరిపితే చంద్రబాబునాయుడు అవినీతి బండారం బట్టబయలు అవుతుందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీతో లోపాయికారి ఒప్పందం వల్లే విచారణపై కాంగ్రెస్ సర్కార్ మౌనంగా ఉందని  ఆయన అన్నారు. వై.ఎస్.అధికారంలో ఉన్నప్పుడు చేయని పని తాము చేస్తామని వైసీపీ నాయకులు  చెబుతున్నారన్నమాట.. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో నలిగిపోతుంటే అవి వదిలేసి, మేము అధికారంలోకి వస్తే ఆ భూమి పై విచారణం చేస్తాం అంటే దాని వలన ఎవరికి లాభం అనేది తెలియకుండా నాయకులు మాట్లాడుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles