Political congress promises free laptops and 30 kg rice for rs 30

congress promises free laptops and 30 kg rice for rs 30, congress, karnataka polls, karnataka elections, free laptops, election manifesto, ak antony, mallikarjuna kharg

congress promises free laptops and 30 kg rice for rs 30

ల్యాప్‌టాప్‌లు ఫ్రీ.. ఫ్రీ..? 30 రూపాయలకే 30 కేజీల బియ్యం?

Posted: 04/25/2013 01:57 PM IST
Political congress promises free laptops and 30 kg rice for rs 30

కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకు ఒక కొత్త పథకంతో ప్రజల ముందుకు వస్తుంది. ఇప్పుడు విద్యార్థుల కోసం ఉచితంగా ల్యాప్ టాప్ ఇవ్వటానికి సిద్దమైంది. 30 రూపాయలకే 30 కేజీల బియ్యం ఇస్తామని ప్రకటన చేస్తుంది. రోజకు 8 గంటలు కరెంట్ ?కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కొత్తదనం లోపించింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి అరువు తెచ్చుకున్న రూపాయికే కిలో బియ్యం, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ప్రవేశపెట్టిన ఉచిత ల్యాప్‌టాప్‌ల పథకాలను కాపీ కొట్టింది. దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు కిలో బియ్యం రూపాయి చొప్పున నెలకు 30 కిలోలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. పీయూసీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌తోపాటు డిజిటల్ నోట్‌బుక్ ఇస్తామని వాగ్దానం చేసింది. వ్యవసాయానికి రూ.2 లక్షల వరకు వడ్డీ రహిత రుణాలు, రూ.5 లక్షల వరకు పావలా వడ్డీపై రుణాలిస్తామని హామీ ఇచ్చింది. రోజుకు 8 గంటల పాటు నిరంతరాయంగా మూడు ఫేసుల్లో విద్యుత్‌ను సరఫరా చేస్తామని పేర్కొంది. సౌర విద్యుత్ పంపుసెట్లను ఏర్పాటు చేసుకునే రైతులకు 75 శాతం సబ్సిడీ ఇస్తామని తెలిపింది. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికను కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఏకే. ఆంటోనీ విడుదల చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles