ఉత్తర గోగ్రహణమని భారతంలో విరాటపర్వంలో ఉంటుంది. అఙాత వాసం చేస్తున్న విరాటరాజు రాజ్యం నుంచి కౌరవులు ఆవులను బలవంతంగా తోలుకెళ్తుంటారు. గోదానం చెయ్యటం, గోవులను సంపదలుగా చూసుకోవటంలాంటి ఆచారాలు ఉండటం వలన ఆ కాలంలో వాటి దొంగతనాలు జరుగుతుండేవి కానీ పెద్ద సామ్రాజ్యాన్ని పాలించే చక్రవర్తి, భీష్మ ద్రోణాది మహా యోధలు ఆవులను దొంగిలిచటానికి రథాలు, సైనికుల సమేతంగా తరలి రావటం చిన్నప్పుడు మాకు హాస్పాస్పదంగా అనిపించేది. అయితే ఆ పనిలో పాండవులను బయటకు రప్పించటమనే లక్ష్యం ఉందనుకోండి.
కానీ పెరుగుతున్న ధరలలో జంతువుల ధరలు ముఖ్యంగా ఆహారంగా ఉపయోగించే జంతువుల ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో హైద్రాబాద్ నగర శివార్లలో జంతువుల దొంగతనాలు బాగా జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఇన్నోవా కారులో వచ్చి గొర్రెలను ఎత్తుకుపోదామని ప్రయత్నం చేసిన దుండగలు, స్థానికులు అడ్డం తిరగటంతో అదాటుగా కొందరు పారిపోవటం, కారుని అడ్డగించిన వారిమీదకు ఎక్కించటం చేసారు.
నగర శివార్లలోనే కాదు నగరంలోకూడా గుడెసెల్లో నివసిస్తూ జీవితాన్ని వెళ్ళదీసుకునేవారు, అదనపు ఆదాయంగా ఉంటుందని కోళ్ళు, గొర్రెలను పెంచుతుంటారు. అవి స్వేచ్చగా అటు ఇటు తిరిగి సాయంత్రానికల్లా ఇంటికి తిరిగి వచ్చేస్తాయి. అయితే కాస్త ఏపుగా పెరగగానే వాటిని కాపాడుకోవటానికి నానా తంటాలు పడవలసివస్తోందంటున్నారు పాత బస్తీలోని స్థానికులు. ఆటోల్లో వచ్చి గబుక్కున ఆ జంతువులను అందుకుని రయ్యి మని వెళ్ళిపోతున్నారు దోపిడీ దొంగలు. చాంద్రాయణ గుట్టలో అలా ఆటోలో తీసుకెళ్తున్న దుండగుల అడ్డగించిన మనిషి మీదకు కూడా ఎక్కించి ఆటోని తీసుకుని వెళ్ళిపోవటం జరిగింది. జహంగీర్ అనే వ్యక్తి ఈ సంవత్సరంలోనే మూడు గొర్రెలను పోగొట్టుకున్నాని, 15000 రూపాయల వరకూ నష్టపోయానని తన వేదనను వ్యక్తపరచాడు. ఇలాంటి కేసులెన్నో.
3000 వేల నుంచి 8000 వేల వరకూ ఒక్కో గొర్రె ఖరీదు చేసే జంతువులను పోగొట్టుకున్నవారు లబోదిబో మని పోలీసులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం ఉండటం లేదు. పోలీసులు ఈ కేసులను పట్టించుకోవటం లేదని బాధితులు వాపోతున్నారు. ఎక్కడైనా స్థానికులకు దొరికితే మాత్రం పోలీసులకు అప్పగించేముందు వాళ్ళకి దేహశుద్ధిని బాగా చేసి మిగతా పని మీరు చూసుకోండని అంటున్నారు. అపహరణకు గురైన జంతువులు అటువంటి సరుకుని సగం రేటుకి కొనే కొన్ని కబేళాలకు తరలిపోతుంటాయి. వివిధ పనుల్లో వ్యస్తులైవున్న పోలీసుల దృష్టిలో ఇవి చాలా చిన్న కేసులే కానీ, పెద్దగా పెట్టుబడి పెట్టకపోయినా, వాటిమీదనే ఆశలు పెట్టుకున్న పేదవాళ్ళకి అది పెద్ద నష్టమే.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more