సమాజం ఇంత ఆధునిక పోకడలు పోతున్నా మనం ఇంకా పాటిస్తున్నవి కొన్ని ఉన్నాయి. అందులో ఇంకా జీవించివున్నవి- ఉదయాన్నే ఉగాది పచ్చడి తినటం, ఆరోజు పంచాంగ శ్రవణం వినటం.
ఉగాది ఇంకా సరిగ్గా వారం రోజులుంది. ఇప్పటినుంచీ పర్వదినాన్ని సజావుగా జరుపుకునేందుకు సర్వ సన్నాహాలూ జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ఆలయాలన్నీ అందుకు కావలసిన ఏర్పాట్లను చేసుకుంటున్నాయి. భక్తుల రద్దీని, చెయ్యవలసిన తంతుని కూడా సరిగ్గా నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి.
కలియుగ ప్రత్యక్ష దైవంగా, అతి సంపన్నుడిగా పేరుగాంచిన తిరుమల వాసుని చెంత ఏర్పాట్లకు కొదవేముంటుంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు బంగారు వాకిలి దగ్గర ఆస్థానం, పంచాంగ శ్రవణం కార్యక్రమాలు జరపటానికి నిర్ణయించుకున్నారు. దీని కారణంగా ఆరోజు తిరుప్పావడ, కళ్యాణోత్సవం, వూంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవ సేవలను రద్దుచెయ్యటం జరిగింది.
మరి ఉగాది పర్వదినానికి ముందే శుభ్రపరచుకునే కార్యక్రమాన్ని చెపట్టాలి కదా. అందుకే 9 వ తారీఖున కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం చెయ్యటానికి నిర్ణయించుకున్నారు. దాని వలన ఆరోజు కూడా దైనందిన కార్యక్రమాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. అందులో ఒకటి, 6 గంటల నుంచి 11 గంటల వరకు స్వామి దర్శనానికి అనుమతించరు.
ఉగాది గురువారం అవటం వలన, దానికి అటుగాని ఇటుగాని కొన్ని రోజులను జోడించి దూరంలో ఉండే తనవాళ్ళతో గడపటానికి కొందరు ప్రణాళికలు వేసుకుంటే, మరికొందరు శలవుల్లో దైవదర్శనానికి తిరుపతి ప్రయాణం పెట్టుకునేవారు మరికొందరుంటారు. అలాంటి వాళ్ళకోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలోని ప్రధాన కార్యక్రమాన్ని పై విధంగా ప్రకటించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more