ఈరోజు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరపనుంది. అందులో విద్యుత్ సమస్య మీద చర్చలు జరుగుతాయి. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల పెంపుకి వ్యతిరేకంగా ఇప్పటికే చెలరేగుతున్న నిరసన జ్వాలలు ప్రభుత్వ మనుగడకే ఎసరు పెట్టకముందే ప్రతిపక్షం వాళ్ళంతా కలిసి మెడలు వంచినట్టు కాకుండా, ఇందిరమ్మ బాట, ఇతర కార్యక్రమాలలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్తూ వస్తున్నట్టుగా పేదల మీద భారం పడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలన్న విషయంలో ఆలోచనలు చెయ్యబోతున్నారు. బహుశా సాయంత్రం వరకు విద్యుత్ ఛార్జీల విషయంలో ఏమైనా శుభవార్త వినవచ్చునేమో.
ఇప్పటి వరకూ వినపిస్తున్న మాటలను బట్టి, ఉచిత విద్యుత్ లో మార్పుల ఉండబోవు, 150 యూనిట్ల వరకూ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వమే రాయితీ ఇచ్చి భరించవచ్చు. విద్యుత్ సమస్య దేశవ్యాప్తంగా ఉన్న సమస్యని, ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలా అని చూడాలి కానీ ఇందులో రాజకీయం చెయ్యటం తగదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ నిన్న అన్నారు.
అయితే మనలో మన మాట, ప్రతిపక్షాలు ఆందోళన చేసేదే ప్రభుత్వం మీద వత్తిడి పెంచి నిర్ణయాలు తీసుకోవటం కోసం. చేసేది ప్రభుత్వమే, అందులో వివాదం లేదు. కానీ చెయ్యవలసిన అగత్యం ఏర్పరుస్తున్నవి మాత్రం ప్రతిపక్షాలు. ఎంత గంగి గోవైనా పితకకుండా పాలివ్వదు. అడగందే అమ్మైనా బువ్వ పెట్టదనే సామెతెలాగూ ఉండనే ఉంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more