తెలంగాణా ఐక్య కార్యాచరణ సంఘం ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఆకాంక్షను వెలిబుచ్చుతూ చేస్తున్న ఆందోళనలో భాగంగా రూపొందించిన సడక్ బంద్ కార్యక్రమాన్ని రేపు జరపటానికి నిర్ణయించుకున్నారు. 24 గంటలపాటు హైద్రాబాద్ బెంగళూరు హైవే మీద జరిగే ఈ కార్యక్రమానికి లక్ష్యం తెలంగాణా మీద ప్రతిపాదనను శాసన సభలో పెట్టటానికి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటమేనని ఐకాస ఛైర్మని ప్రొ.కోదండరామ్ అన్నారు. ప్రభుత్వం ఆ ప్రతిపాదనను పెడితే సడక్ బంద్ ను రద్దుచేసుకుంటామని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో ముందు అనుకున్నట్టుగానే ఈ కార్యక్రమాన్ని అమలు పరచటానికి ఐకాస నిర్ణయించుకుందని ఐయన అన్నారు.
హైద్రాబాద్ నుంచి మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ వరకు 189 కిలోమీటర్ల దూరంలో జరిగే ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలైనా తెలంగాణా రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, సిపిఐలు పాల్గొంటున్నాయి. ఫిబ్రవరి 24 న చేద్దామనుకున్న ఈ కార్యక్రమం ఫిబ్రవరి 21 న దిల్ సుఖ్ నగర్ లో జరిగిన బాంబు పేలుళ్ళ దృష్ట్యా అప్పడు వాయిదా వేసుకున్నారు.
ఈ విషయంలో ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి హైవేల మీద బంద్ లు జరగకూడదనే ఉద్దేశ్యంతో సడక్ బంద్ కి అనుమతి లేదు కాబట్టి ఆ విషయంలో పోలీసులు తమ పని తాము చేసుకుంటారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఉద్యమాన్ని అణిచి తెలంగాణా ఆందోళనను అణగదొక్కటానికి ప్రభుత్వం చేసే పనులు విఫలమౌతాయని, ఇప్పటికే 2400 మంది మీద బైండోవర్ కేసులను పోలీసులు పెట్టారని, 10000 మంది పోలీసు బలగాలతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్నారని కోదండరామ్ ఆరోపిస్తూ, ఎంత మంది పోలీసులు తెచ్చుకున్నా సరే ఈ కార్యక్రమం విజయవంతమౌతుందని అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more