ప్రభుత్వోద్యోగులుగా అత్యున్నత పదవిని, అధికారాలను, బాధ్యతలను కూడా కలిగిన వారే ఐఏఎస్ లు. వాళ్ళు కూడా ఈ మధ్యకాలం లో నేరారోపణలను ఎదుర్కుంటున్నారు. కొత్త చట్టాలను చేస్తూ పాతవాటిని అవసరమైనప్పుడల్లా సవరిస్తూ, ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించటానికి ఉన్నవారు ప్రజలచేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులైన రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు ఎప్పటి నుంచో అవినీతి ఆరోపణలను ఎదుర్కుంటూ వస్తున్నారు. కానీ తాజాగా ఐఏఎస్ లు మీదా ఆరోపణలు రావటమే కాకుండా, మంత్రులను వాళ్ళు తప్పు పట్టటం, ఐఏఎస్ లమీదకు మంత్రులు తోసెయ్యటం కూడా జరుగుతోంది. పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలను ఎదుర్కుని సిబిఐ విచారణలో ఉన్న ఐఏఎస్ ఆంధ్రప్రదేశ్ కి చెందిన శ్రీలక్ష్మి. 1979 బ్యాచ్ ఐఏఎస్ దంపతులు అరవింద్, టీనూ జోషీలు 2010 లో మధ్యప్రదేశ్ లో ఆదాయ పన్ను విభాగం వారి దాడిలో 350 కోట్ల విలువగల ఆస్తులతో పట్టుబడ్డారు.
వీటన్నిటి దృష్ట్యా అధికారంలో ఉన్న 4737 ఐఏఎస్ లను వారి వారి ఆస్తులను ప్రకటించవలసిందిగా ప్రభుత్వం కోరినా, 2012 సంవత్సరానికి ఇంకా 1057 మంది వారి వారి స్థిరాస్థి వివరాలను (ఐపిఆర్) సమర్పించలేదు. అందులో సంఖ్యనుబట్ట పై స్థాయిలో చూసుకుంటే ఉత్తర ప్రదేశ్ నుంచే 147 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏమీ తక్కువ తినలేదు. 53 మంది ఇంకా వాళ్ళ స్థిరాస్తుల రిటర్న్ ని ఫైల్ చెయ్యవలసివున్నారు.
ప్రతి సంవత్సరం జనవరి నెల లోపులో అఖిల భారత సర్వీస్ లో ఉన్నవారు తప్పని సరిగా అంతకు ముందు సంవత్సరాంతంలో వారి స్థిరాస్తుల వివరాలను అందజేయవలసివుంది. లేకపోతే వారిని పదవుల్లో ఉన్నతికి అనర్హులగా పరిగణిస్తారు. పదోన్నతి ఎవరికి కావాలి, అది లేకుండానే కావలసినంత దొరుకుతున్నప్పుడు అని అనుకుంటే అందుకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఇంకా ఏమీ ఆలోచించలేదు. 2010, 2011 సంవత్సరానికి కూడా ఇంకా రిటర్న్ ఫైల్ చెయ్యని వారున్నారని తెలిసింది. వీరిని నియంత్రించే డిపార్ట్ మెంట్ ఆఫ్ పెర్సనల్ ట్రైనింగ్ ఐఏఎస్ లకు వెంటనే స్థిరాస్తుల రిటర్న్ లు ఫైల్ చెయ్యమంటూ సర్కులర్ ని పంపించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more