దేశమే నాకు ప్రధానం- వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పిన నరేంద్ర మోదీ.
వార్టన్ ఇండియా ఎకానామిక్ ఫోరమ్ లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ఉపన్యాసాన్ని రద్దు చేసిన సందర్భంగా ఆయనకు వీసా కూడా తిరస్కరించబడింది. మోదీ మీద ఎంతో కాలంగా రగులుతూ నలుగుతున్న 2002 మత విద్వేష చర్యారోపణే ఆయనకు ప్రతిబంధకం, వ్యతిరేక ప్రచారమైపోయింది. మానవ హక్కులను ఉల్లంఘించారనే నేరం మీద ఉపన్యాసాన్ని రద్దు చెయ్యటమే కాకుండా, మోదీకి అమెరికా వీసాననూ తిరస్కరించారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ విద్యార్థులు, ఆచార్యుల నుండి వచ్చిన వ్యతిరేకత మూలకంగా వార్టన్ ఇండియా ఎకానామిక్ ఫోరమ్ లో మోదీ ముఖ్యోపన్యాసాన్ని రద్దు చేసినా, దానికి ముందునుంచే భారతీయ జనతా పార్టీ అమెరికాలో న్యజెర్సీలోని ఎడిసన్, చికాగో లలో మోదీ ఉపన్యాసాన్ని తిలకించటానికి జనం పోగయ్యారు.
గుజరాత్ గాంధీనగర్ నుంచి ప్రసారం చేసిన వీడియో ప్రసంగంలో నరేంద్ర మోదీ తన ఉద్దేశ్యంలో దేశభక్తే ఘనమైన లౌకికవాదమని చెప్పారు. గంటసేపు హిందీలో ఉపన్యాసమిచ్చిన మోదీ 2002 సంవత్సరంలో గోధ్రా లోజరిగిన మత కల్లోలాల గురించి ప్రస్తావించలేదు కానీ, తనకు కులాలు మతాలకంటే దేశమే ముఖ్యమైనదని అన్నారు. దేశ సౌభాగ్యం తర్వాతనే మరేదైనా అని, దేశవాసులందరూ అలాగే భావించవలసి ఉంటుందని అన్నారు. భారతీయులుగా, దేశప్రేమికులుగా మీరంతా నా అభిప్రాయంతో ఏకీభవిస్తారని నమ్ముతున్నాను అని మోదీ అన్నారు.
తన ప్రసంగంలో ఢిల్లీలో జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడినంత వాడిగా వేడిగా యుపిఏ ప్రభుత్వాన్ని తూర్పారపట్టలేదు కానీ, బడ్జెట్ ఇతర విషయాల్లో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరిని ప్రస్తావించారు. భారత్ లో పర్యటనను ప్రోత్సహించవలసిందిగా మోదీ అమెరికన్ వాసులను కోరారు. పర్యటనను అభివృద్ధి చెయ్యటం కూడా భారత్ పట్ల చేసే సేవగానే స్పీకరించబడుతుందని అన్నారాయన.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more